-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆర్ధికంగా నిధుల కొరత తలెత్తి సంక్షోభంలో కూరుకుపోతుందన్న వాదనలు పటాపంచాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణ భార యాజమాన్య విధానాల్లో అత్యంత ఆధునిక ఆర్థిక సాంకేతిక విధానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది.
హైదరాబాద్, మార్చి 18: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సోమవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీతో చర్చలు జరపనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్కతాకు బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పార్టీ ఎంపీలు కె. కేశవరావు, కవిత ప్రభృతులు వెళ్ళనున్నారు.
కెరమెరి, మార్చి 18: ఆపిల్ పండు తినాలనిపించే వాళ్లు కాశ్మీర్ ఆపిల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆపిల్ పండు కోసం దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కొద్ది రోజులు ఓపిక పడితే చాలా తెలంగాణ లో కెరమెరి ఆపిల్ రాబోతుంది. తెలంగాణ ఆపిల్ రుచి చూసే అవకాశం లభించబోతుంది. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఆపిల్ మన సొంతం కాబోతున్నాయి.
ఆదిలాబాద్,మార్చి 18: నష్టాల సాకుతో మూడేళ్ళ క్రితం మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్పిఎంను పునరుద్ధరించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తూ రాయితీల కల్పనకు కేబినెట్లో ఆమోదించడంతో కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
సిరిసిల్ల, మార్చి 18: సిరిసిల్ల మున్సిపల్ బడ్జెట్ ఆమోదం వివరాలు వెల్లడి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన టీఆర్ఎస్కు చెందిన సామల పావని వెల్లడించారు.
అచ్చంపేట, మార్చి 18: గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యానాయక్ డిమాండ్ నేడొ క ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 తెగలకు సంబందించిన గిరిజనులు 9.91 శాతం దాదాపు 40 లక్షల జనాభా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం 10శాతం రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 18: జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించే బిల్లును ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తామని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 18: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనున్నది.
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఐపీఎస్ఎస్ అధికారి వివి శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపి కార్యాలయం రెండో అంతస్తులో ఉన్న రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 9 గంటల సమయంలో ఆయన సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆయన హైదరాబాద్ నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్గా పని చేశారు.
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ విళంబినామ సంవత్సరం ఉగాది వేడుకలు, సంబురాలు ఘనంగా జరిగాయి.