-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజస్ అసోసియేషన్ హైసీ రజతోత్సవ వేడుకలు ఈ నెల 30వ తేదీన హెచ్ఐసిసిలో జరుగుతాయని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభిస్తారని హైసీ అధ్యక్షుడు పోతుల రంగ చెప్పారు. హైదరాబాద్ భారతదేశంలో ఐటి రాజధానిగా అవతరించేందుకు హైసీ చేసిన కృషి నిరుపమానమన్నారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించనున్నట్లు చెపాపు .
హైదరాబాద్, నవంబర్ 23: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో డిసెంబర్ 5 న జరిగే ‘ఆస్ట్రేలియా-ఇండియా లీడర్షిప్ సమావేశా’నికి హాజరు కావాలంటూ పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావుకు అధికారికంగా ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియా, ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధినేతలు, పాలసీమేకర్లు, మేధావులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 7900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ కేంద్రాన్ని కోరనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది.
హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 22: కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గేలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో డప్పోల్ల రమేష్ రచించిన ‘చిటిక కోలా దండోర’ వర్గీకరణ ఉద్యమ దీర్ఘ కవిత అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది.
హైదరాబాద్, నవంబర్ 22: సైబర్ దాడులను అడ్డుకోవడానికి సైబర్ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై నూతన పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలోని అత్యవసర క్లాజును ఉపయోగించి ఇప్పటికిప్పుడు భూమిని సేకరించే పరిస్థితి లేదని, నాలుగు వారాలపాటు ఈ క్లాజును ఉపయోగించి భూములను అధీనంలోకి తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్తో కూడిన ధర్మాసనం జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 22: వామపక్ష పార్టీల ప్రభావిత జిల్లాల్లో పెద్ద నోట్ల మార్పిడికి ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. రద్దయిన పాత నోట్లు చత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు తరలుతున్నట్టు తెలుస్తోంది. కరెన్సీ మార్పిడిపై తెలంగాణ, ఆంధ్రా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎస్బిఐ, ఎస్బిహెచ్లకు కొత్త కరెన్సీ కట్టలు వచ్చిపడుతుండగా, ఇతర బ్యాంకులు నగదు లేక వెలవెలపోతున్నాయి. వారంలో 24 వేల రూపాయల వరకు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించినప్పటికీ, ఈ విధానం ఎస్బిఐ, ఎస్బిహెచ్లలోనే అమలవుతోంది.
హైదరాబాద్, నవంబర్ 22: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల లీకైంది. కొన్ని రోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నిమిషాల నిడివి గల బాహుబలి-2 సన్నివేశాలు తస్కరించింది గ్రాఫిక్ డిజైనర్ కృష్ణ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్, నవంబర్ 22: నేరాలు, అవినీతిని అరికట్టాల్సిన వారే దారితప్పుతున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సుబ్బయ్య, సునీల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు భారీ మొత్తంలో రూ. 1000, రూ. 500 పెద్ద నోట్లు మార్చుతూ అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పంజగుట్ట పోలీసులు తెలిపారు.