S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/23/2016 - 16:20

హైదరాబాద్: వచ్చే నెల 11న నగరంలో 25లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను ఖరారు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం తెలిపారు. హరితహారం పథకం కింద నగర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆయన కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

06/23/2016 - 16:19

హైదరాబాద్: బంగారు తెలంగాణను సాధిస్తానని సిఎం కెసిఆర్ పదే పదే గొప్పలు చెబుతున్నారని నిజానికి ఆయన వల్ల బూడిద తెలంగాణ రూపుదాలుస్తోందని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన రెడ్డి గురువారం మీడియాతో అన్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట ప్రభుత్వ నిధులను తెరాస పాలకులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి ప్రజలకు బూడిద ఇస్తున్నారన్నారు.

06/23/2016 - 16:19

హైదరాబాద్: మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటోందని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను తాము అడ్డుకుని భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత జయశంకర్ వర్ధంతిని తెరాస సర్కారు అధికారికంగా నిర్వహించక పోవడం తనకు ఆవేదన కలిగించిందన్నారు.

06/23/2016 - 15:16

హైదరాబాద్: చాలాకాలంగా ‘ఇదిగో.. అదిగో..’ అంటున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఎట్టకేలకు గురువారం ఇక్కడ ప్రారంభమైంది. తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి’ని చిరంజీవితో దర్శకుడు వివి వినాయక్ రీమేక్ చేస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర సమర్పకుడు, చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పెట్టారు.

06/23/2016 - 14:08

హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్సీలపై తక్షణం అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అనైతికంగా తన పార్టీలో చేర్చుకోవడం తప్ప సిఎం కెసిఆర్ చేసిందేమీ లేదన్నారు.

06/23/2016 - 12:08

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఆవరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.

06/23/2016 - 12:07

నల్గొండ: సూర్యాపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు చేస్తుండగా విశాఖ నుంచి వస్తున్న ఓ జీపులో 2.40 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్నందుకు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు నిజామాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు అంగీకరించారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/23/2016 - 11:53

హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

06/23/2016 - 08:53

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో తామూ సహకరిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ యాష్‌క్విన్త్ హామీ ఇచ్చారు. రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు బుధవారం నగరంలో బ్రిటిష్ హైకమిషనర్ (ఇన్ ఇండియా) డొమినిక్ యాష్‌క్విన్త్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటీష్ హైకమిషనర్ తెలిపారు.

06/23/2016 - 08:42

సంగారెడ్డి, జూన్ 22: మెదక్ జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూముల ముంపు బాధితులు నిర్వహిస్తున్న ఉద్యమాలకు వివిధ పార్టీల నేతలు సంపూర్ణ మద్దతు పలుకుతుండడంతో ఉద్యమాలు ఉధృతరూపం దాల్చనున్నాయి.

Pages