-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘పోలీసు ఇన్ఫార్మర్ల’ పేరుతో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన కుటుంబాలు అల్లల్లాడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 80 కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. వీరిలో సుమారు 30 కుటుంబాలకు చెందిన కేసుల్లో తీర్పు చెబుతూ, ఒక్కో కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 90 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటన హాస్యాస్పదమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. బిజెపి ప్రకటనను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తోసిపుచ్చుతూ తెలంగాణకు అందిన సహాయాన్ని అంకెలతో వివరించడాన్ని హర్షిస్తున్నామని ఆయన తెలిపారు.
కరీంనగర్, జూన్ 12: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ కూడా ఇందుకోసమేనన్నారు.
బాసర, జూన్ 12: రాష్ట్రంలో చదువుల తల్లి కొలువుదీరిన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, నేటి నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు.
యాదగిరిగుట్ట, జూన్ 12: నల్లగొండ జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీనృసింహుడికి అనుబంధ శివాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. క్షేత్ర సందర్శనకు వచ్చిన యాత్రికులు స్వామికి అర్చనతో పాటు నిత్య కళ్యాణ పర్వాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ నగరంలో పోలీస్ల సంక్షేమం, పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు కేటాయించిందని హోం శాఖ మంత్రి నాయిని నార్సింహరెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పునరుద్ఘాటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.35 లక్షల వ్యయంతో ఆధునీకరించిన పేట్బషీరాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.
నల్లగొండ, జూన్ 12: కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీస్పై పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్లో పనిచేస్తున్న తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ ఆయన పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. జానారెడ్డిని విమర్శించలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 12: తెరాస అధ్యక్షునిగా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ను నియమించగలరా? అని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో బిజెపి బహిరంగ సభ విజయవంతం కావడంతో తెరాస బెంబేలెత్తుతోందని ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో అన్నారు.
మోర్తాడ్, జూన్ 12: పసుపు సాగు విధానంలో ఆధునీకతను తీసుకువచ్చి అధిక దిగుబడులు పొందేలా ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. పురాతన విధానాలకు స్వస్తి పలికి, నూతన సాగు విధానాలను అలవర్చుకునేలా రైతులను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో తొలి విడత నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 100 మంది రైతులను ఎంపిక చేశారు. అందులో 80 మంది రైతులతో బాల్కొండ సింహ భాగాన్ని పొందింది.
సిద్దిపేట, జూన్ 11 : గోదావరి నీటిని తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు స్పష్టం చేశారు. 2017లోగా రంగనాయక్ సాగర్ ద్వారా సిద్దిపేట నియోజక వర్గంలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.