S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఘట్కేసర్, మే 27: సామాజిక సేవా స్ఫూర్తి కలిగిన ప్రతి వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైకర్టర్ ఎన్.కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కేఎల్ఆర్ గార్డెన్లో జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్, మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వికారాబాద్, మే 27: బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్లో బాల్య వివాహాలను వ్యతిరేకిద్దాం, బాల్యాన్ని రక్షిద్దాం అనే అంశంపై చైల్డ్లైన్, ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించారు.
ఖైరతాబాద్, మే 27: మహిళల అక్రమ రవాణను అడ్డుకునేందుకు అంతా నడుం బిగించాల్సి ఉందని ప్రజ్వలా సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో యూఎస్ కాన్సొలేట్ ప్రతినిధి మైకేల్తో కలిసి ఆమె మాట్లాడారు. బాలికలు, స్ర్తిల అక్రమ రవాణ సరిహద్దులు దాటి అన్ని దేశాల్లో కొనసాగుతున్న అతి పెద్ద సమస్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 27: పేద, బడుగు వర్గాల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసే గుడుంబా తయారీని మానుకుని, మీ అంత మీరే మీలో మార్పు తెచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ధూల్పేట వాసులకు హితవు పలికింది ధూల్పేట పునరావాస కమిటీ. కలెక్టర్ రాహుల్ బొజ్జ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం జరిగింది.
షాబాద్, మే 27: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చర్లగూడలో జరిగింది. షాబాద్ ఎస్ఐ శ్రీ్ధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చర్లగూడ గ్రామానికి చెందిన పడగంటి రవీందర్రెడ్డి(40) తనకున్న 4 ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న, పంటలు సాగు చేశాడు. గత కొనే్నళ్లుగా వర్షం సరిగ్గా కురియకపోవడంతో పంట దిగుబడి రాలేదు.
రాజేంద్రనగర్, మే 27: టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరబోతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ అన్నారు. శుక్రవారం అరాంఘర్ చౌరస్తాలోని ఇంద్రారెడ్డినగర్లో సుమారు 150 కుటుంబాలు గుడిసెలు వేసుకొని గత ముప్పై ఏళ్లుగా ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెల్లిబుచ్చుకున్నారు.
అల్వాల్, మే 27: కంటోనె్మంట్లో రోడ్ల మూసివేత నిర్ణయాన్ని మరో ఆరుమాసాలు పాటు వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అధికారికంగా కంటోనె్మంట్ బోర్డు కార్యాలయానికి, బొల్లారంలోని తెలంగాణ మిలటరీ సబ్ ఏరియా కమాండర్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
హైదరాబాద్, మే 27: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలకు ట్యాంక్బండ్ ప్రాంతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారనుంది.
హైదరాబాద్, మే 27: జిహెచ్ఎంసి అభివృద్ధి పనులు, పౌర సేవల నిర్వహణతో పాటు పరిపాలన అంశాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు వచ్చే నెల 8న నిర్వహించనున్న స్థారుూ సంఘం ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులకు టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్ల నుంచి నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు 46 నామినేషన్లు అందాయి.
ఆదిలాబాద్, మే 27: జిల్లా నూతన ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ శుక్రవారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా 18 నెలల పాటు పనిచేసిన తరుణ్ జోషి గ్రేహాండ్స్ గ్రూప్ కమాండెంట్గా ఇటీవలే బదిలీకావడంతో కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో తరుణ్ జోషి నుండి పదవీ బాధ్యతలు స్వీకరించారు.