-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, డిసెంబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను అల్పపీడనంగా మరింత బలహీన పడి, ఇంటీరియల్ కర్నాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఇది పూర్తిగా బలహీన పడినట్టేనని పేర్కొన్నారు. అయితే దక్షిణ కోస్తాలో ఇంకా పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 13: వృద్ధాప్యపు పింఛను కోసం క్యూలో నిలబడి, గుండెపోటుతో ఒక వృద్ధుడు మృతిచెందాడు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ వద్ద మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... కేతవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ బ్యాంకింగ్ ఉండటంతో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు చెల్లిస్తున్నారు.
విజయవాడ, డిసెంబర్ 13: ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో సింగపూర్ తరహా విధానాన్ని అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సొంత ఆర్థిక వనరులతో పాటు బయటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి సింగపూర్ ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని ఆయన తెలిపారు.
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వం మూర్ఖత్వంగా అమలు చేసిన పెద్దనోట్ల రద్దుతో గత 36రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాలకులను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతోందని ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు.
ఆత్మకూరు, డిసెంబర్ 13: అసలే నోట్ల కష్టాలు.. ఆపై బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలు... ఇంతలో నో క్యాష్ అని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో సహనం కోల్పోయిన మహిళలు తిరగబడ్డారు. సర్దిచెప్పపోయిన ఎస్ఐని అడ్డుకున్నారు. దీంతో ఎస్ఐ ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడంతో మహిళలు ఆవేశంతో ఎస్ఐపై పడి గోళ్లతో రక్కేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు/ఒంగోలు, డిసెంబర్ 13: వార్ధా తుఫాన్ ముప్పు చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తప్పినట్లు అయ్యింది. సోమవారం తుఫాన్ చిత్తూరు తూర్పు మండలాలను వణికించింది. ప్రకాశం జిల్లాలో కందుకూరు డివిజన్లో భారీవర్షాలు కురిశాయి. మంగళవారం మధ్యాహ్నంనుంచి క్రమేణా ఈ ప్రభావం తగ్గిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పొన్నలూరు, డిసెంబర్ 13: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని సంగమేశ్వరం సమీపంలో పాలేరు నదిలో చెన్నుపాడుకు సంబంధించిన నలుగురు రైతులు మంగళవారం చిక్కుకుపోయారు. చెన్నుపాడు గ్రామానికి చెందిన రైతులు పాలేరు నదిలో వ్యవసాయ బోర్లు ఉండగా, వాటికి ఇంజన్లు ద్వారా నీటిని సరఫరా చేస్తూ పైర్లను కాపాడుకుంటున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 13: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం ఇక్కడ లోటస్పాండ్ వైకాపా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబు చేతిలో ఆంధ్ర బిజెపి నేతలు కీలుబొమ్మలుగా మారారన్నారు. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వమే మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు తీరును అనుమానిస్తోందన్నారు.
అమరావతి, డిసెంబర్ 13: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కేంద్ర నాయకత్వం ఆశిస్తుంటే కొత్తవారిని విజయవంతంగా బయటకు పంపించడంలో రాష్ట్ర పార్టీ సీనియర్లు బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవారు చేరకుండా, చేరిన వారిని వారంతట వారే వెళ్లిపోయేలా చక్రం తిప్పుతున్న తమ నేతల వైఖరితో పార్టీ తిరోగమిస్తోందని బిజెపి శ్రేణులు ఆవేదన చెందుతున్నారు.
విశాఖపట్నం, డిసెంబర్ 13: విశాఖలో నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టయంది. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి రూ.16.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఎంవిపి కాలనీ సెక్టార్ 3లో ఆరుగురు సభ్యులు గల బృందం నోట్ల మార్పిడికి సిద్ధ పడుతుండగా టాస్క్ఫోర్స్ ఎసిపి చిట్టిబాబు నేతృత్వంలో పట్టుకున్నారు.