S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/03/2016 - 05:47

హైదరాబాద్, జూలై 2: వైకాపా అధ్యక్షుడు జగన్‌పై అక్రమాస్తుల కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏ మాత్రం నైతికత ఉన్నా, పార్టీని రద్దు చేయాలని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కేంద్ర ఏజన్సీ సంస్థ అటాచ్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు.

07/02/2016 - 18:24

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన వివిధ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన శనివారం ఇక్కడ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, కచ్చితంగా నెల రోజుల్లోగా పుష్కర ఘాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు, ఆలయాల సుందరీకరణ, రోడ్డు పనులు పూర్తికావాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.

07/02/2016 - 18:23

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఇచ్చిన పిటిషన్‌ను ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం తిరస్కరించారు. టిడిపిలో చేరిన 13 మందిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో వైకాపా స్పీకర్‌కు అర్జీని సమర్పించింది. అయితే, పలు సాంకేతిక లోపాల వల్ల ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు.

07/02/2016 - 18:06

గుంటూరు: ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు.

07/02/2016 - 11:42

విశాఖ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం నగరంలోని ఓ హోటల్‌లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగే సమావేశంలోను, నౌకాదళ అధికారుల సమావేశంలోనూ పాల్గొంటారు. తర్వాత బీచ్‌రోడ్డులో బే మారథాన్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.

07/02/2016 - 11:39

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజిరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొంటారు.

07/02/2016 - 11:36

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

07/02/2016 - 08:31

విజయవాడ, జూలై 1: రంజాన్ పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. స్థానిక చిట్టినగర్‌లోని ఈద్‌గాహ్ షాదీఖానాలో శుక్రవారం ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి అందజేవారు.

07/02/2016 - 08:30

రాజమహేంద్రవరం, జూలై 1: తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు. బ్యారేజీ నిర్వహణలో కీలకమైన బ్రేక్ కాయల్స్ మాయమయ్యాయి. ఒక్కొక్కటి సుమారు రూ.10 వేలు విలువచేసే మొత్తం 140 కాయల్స్ మాయమయ్యాయి. గేట్ల ఎత్తివేతలో ఈ బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

07/02/2016 - 08:29

విజయవాడ, జూలై 1: రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు వేయిస్తే నీరుపడక, వర్షాలు కురవక, పంట పొలాలు ఎండిపోయి పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూగర్భ జలాల గురించి గతంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

Pages