-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గంగవరం, జూలై 2: డీజిల్ సరఫరాకోసం చైన్నై- బెంగళూరు మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపు లైన్ వేసింది. ఈ పైపు లైన్ చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నాల్గవ నెంబరు జాతీయ రహదారి పక్కగా వెళ్తుంది. అయితే మార్గమధ్యలో గల పొన్నమాకులపల్లి సమీపంలో ఐఓసి పైపులైనుకు కన్నం వేసి నెల రోజులుగా పెట్రోలు, డీజల్, గ్యాస్ను తస్కరించి డాబా హోటల్కు సరఫరా చేసుకొని యథేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు.
జలదంకి, జూలై 2: గుప్తనిధులకోసం పవిత్రమైన ప్రాచీనమైన శివాలయంలో శివలింగాన్ని పెకలించిన సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలోని కొండయ్య మఠం వద్ద ఉన్న ప్రాచీన శివాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు జరిపి అక్కడ వున్న శివలింగాన్ని పెకలిచారు.
కావలి, జూలై 2: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మాకన సాయి అనే బాలుడిని వారి కుటుంబానికి పరిచయస్తుడైన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి బాలుడు చదువుతున్న పాఠశాల వద్దే గొంతు కోసి హతమార్చేందుకు యత్నించిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.
సింహాచలం, జూలై 2: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న జరిగే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవో రామచంద్రమోహన్ శనివారం దేవాలయంలో దేవస్థానం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసారు. చతుర్థశి రోజున గిరి ప్రదక్షిణ, పౌర్ణమి రోజున ఆలయ ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్ల పై ఆయన విభాగాధిపతులతో చర్చించారు.
మచిలీపట్నం, జూలై 2: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడకు చెందిన సయ్యద్ వౌలాసాహెబ్(19), ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పేల కృష్ణసాయి(19), విజయవాడకు చెందిన షేక్ సాదిక్(20) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
విశాఖపట్నం, జూలై 2 : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
చీరాల, జూలై 2: ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా పని చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఆయన ప్రకాశం జిల్లా చీరాల వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
గుంటూరు, జూలై 2: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన పారేపల్లి వెంకటేశ్వరరావు బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలం వివాదంలో తనపై కేసు పెట్టారన్న అవమాన భారంతో సొంత గ్రామంలోని తోటవారిపాలెంలో శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు యత్నించగా వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, జూలై 2: వైకాపా తరఫున అసెంబ్లీకి ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్ను స్పీకర్ తిరస్కరించడంపై ఆ పార్టీ మండిపడింది. శనివారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సరైన ఫార్మెట్లో పిటిషన్ ఇవ్వలేదని స్పీకర్ చెప్పారన్నారు. కాని ఏ ఫార్మెట్ కావాలో స్పీకర్ చెప్పాలన్నారు.
విజయవాడ, జూలై 2: కాలేయ వ్యాధితో బాధపడుతున్న 8 నెలల చిన్నారి జ్ఞానసాయి ఆపరేషన్ మరో నెల రోజుల పాటు వాయిదా పడింది. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందు అవసరమైన అన్ని వైద్య, ఆరోగ్య పరీక్షలను వైద్యనిపుణులు పూర్తి చేశారు. తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి జ్ఞానసాయిని అనారోగ్యం నుండి గట్టెక్కించేందుకు తండ్రి రమణప్ప ముందుకు వచ్చాడు.