S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/30/2020 - 05:03

విజయవాడ, జనవరి 29: పెట్రోల్, డీజల్‌కు సంబంధించి వసూలు చేస్తున్న వ్యాట్ (వాల్యూ యాడెడ్ టాక్స్)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. దీని వల్ల లీటర్ పెట్రోల్‌పై 6 పైసలు, డీజల్‌పై 38 పైసలు పెరగనుంది. లీటర్ పెట్రోల్‌పై ప్రస్తుతం 31 శాతం మేర వ్యాట్‌ను, మరో రెండు రూపాయలను సెస్ కింద వసూలు చేస్తున్నారు. ఇకపై సెస్ వేరేగా వసూలు చేయకుండా 35.2 శాతం మేర వ్యాట్‌ను వసూలు చేయనున్నారు.

01/29/2020 - 23:35

న్యూఢిల్లీ, జనవరి 29: ఐటీ దిగ్గజ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ బుధవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గడచిన 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 66.29 శాతం వృద్ధితో రూ. 123.3 కోట్ల ఏకీకృత లాభాలను ఆర్జించినట్టు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 100.2 కోట్ల ఏకీకృత లాభాలను ఆర్జించినట్టు తెలిపింది.

01/29/2020 - 23:34

న్యూఢిల్లీ, జనవరి 29: అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజర్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ప్యాకేజీపై ఈ సందర్భంగా తుది నిర్ణయం జరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని నెలల్లో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో లితిజర్ పర్యటన ప్రాథాన్యత సంతరించుకుంది.

01/29/2020 - 23:33

న్యూఢిల్లీ, జనవరి 29: కంపెనీల చట్టం ద్వారా నష్టాల్లో ఉన్న వివిధ కంపెనీలను మూసివేసేందుకు సంబంధించిన సరికొత్త నిబంధనలను కేంద్ర ప్రభు త్వం నోటిఫై చేసింది. జాతీయ కంపెనీల న్యాయ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి పనిభారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

01/29/2020 - 06:51

గాంధీనగర్: గడచిన రెండు దశాబ్ధాలుగా గుజరాత్ ఆలుగడ్డల సాగులో, ఎగుమతిలో గణనీయమైన వృద్ధిని సాధించి ఇందుకు సంబంధించిన హబ్‌లా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ‘అంతర్జాతీయ ఆలు సదస్సు’ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఆహార ధాన్యాలు, ఆహార వస్తువుల ఉత్పత్తిలో దేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

01/29/2020 - 06:00

ముంబయి, జనవరి 28: ముందే ఊహించిన విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భయాలతో వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

01/29/2020 - 05:58

న్యూఢిల్లీ, జనవరి 28: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి కొత్త చైర్మన్ నియామకానికి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సెబీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అజయ్ త్యాగి మూడేళ్ల పదవీకాల వ్యవధి వచ్చే నెలతో ముగిసిపోతుంది. త్యాగి 1984 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ అధికారి. ఆయన 2017లో సెబీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

01/29/2020 - 05:56

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రభుత్వ రంగ బ్యాంకర్లు తీసుకున్న వివేకవంతమైన వాణిజ్య పరమైన నిర్ణయాలను సమర్థించి ప్రోత్సహించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. మోసాలకు పాల్పడిన అధికారులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలకు అత్యున్నత పాలకవర్గ అధికారుల పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

01/29/2020 - 02:52

విజయవాడ (సిటీ), జనవరి 28: ఇందక్రీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి కానుకల రూపంలో, హుండీల ద్వారా వచ్చిన బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్ (జీబీఎస్) రూపంలో డిపాజిట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

01/28/2020 - 06:26

న్యూఢిల్లీ: రుణ కూపంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయడంలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూరు శాతం వాటాను విక్రయించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు ప్రకటించింది. ఆసక్తి గల సంస్థలు మార్చి 17లోగా ఇందుకు సంబంధించి దరఖాస్తు దాఖలు చేసుకోవాలని తెలిపింది.

Pages