S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/10/2020 - 05:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) హవా కొనసాగుతున్నది. ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకూ జరిగిన లావాదేవీల్లో ఎఫ్‌పీఐలు అత్యధిక మొత్తంలో వాటాలను కొనుగోలు చేశారు. వరుసగా ఆరో నెల కూడా మార్కెట్లలో ఎఫ్‌పీఐలు కీలక పాత్రను పోషించడం విశేషం. గత వారం మొత్తం ఎఫ్‌పీఐలు కొనుగోలు చేసిన వాటాల విలువ ఏకంగా 6,350 కోట్ల రూపాయలు.

02/10/2020 - 05:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హిందూజా గ్లోబల్ సొల్లూషన్స్ (హెచ్‌జీఎస్) నికర లాభం సుమారు 94 శాతం పెరిగింది. సెబీకి సమర్పించిన నివేదికలో కంపెనీ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో నికర లాభం 93.7 శాతం లేదా 71.1 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఆ ప్రకటనలో వివరించింది.

02/10/2020 - 05:27

కోల్‌కతా, ఫిబ్రవరి 9: రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలన్న బృహత్తర లక్ష్య సాధనకు వీలుగా కొత్త బడ్జెట్‌లో బలమైన పునాదులే వేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు.

02/10/2020 - 04:52

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 9: క రోనా వైరస్ ప్రభావంతో నగరంలోని మాంసం దుకాణాలు వెలవెలబోయా యి. వేట మాంసం, కోడి మాంసం, చి వరకు కోడిగుడ్లు కూడా తినరాదని ఆ వైరస్ ప్రభావం వల్ల ప్రాణాలకు హాని అని వాట్సాప్, యుట్యూబ్‌లో పోస్టింగ్ ల ప్రభావంతో ఆదివారం పశ్చిమలోని మాంసం దుకాణాల వద్ద వినియోగాదరులు లేక వ్యాపారాలు గిలగిల్లాడారు. ముఖ్యంగా వేటమాంసం, కోడిమాం సం దుకాణాలు ప్రతి ఆదివారం కిటకిటలాడటం జరుగుతుంది.

02/09/2020 - 05:42

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచడానికి కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి మద్దతు స్వల్పంగానే ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే కీలక వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది.

02/09/2020 - 04:50

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మేడారం జాతర భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4వేల ఆర్టీసీ బస్సులు నడిపామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి కుటుంబ సమేతంగా హెలీకాప్టర్‌లో మేడారంకు చేరుకున్నారు. మేడారంలో వన దేవతలతో పాటు గోవిందరాజు, పగిడిద్ద రాజలను దర్శించుకున్నారు. గద్దెలపై కొలువైన సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

02/09/2020 - 02:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ సంస్థ మళ్లీ గత వైభవాన్ని సంపాదించే మార్గం కనిపించకపోవడంతో, 75 శాతం వాటాలను అమ్మేయాలని రుణదాతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆర్బీఐ ఏప్రిల్ 10వ తేదీలోగా బిడ్స్ దాఖలు చేయాలని ఆసక్తిగల పార్టీలకు సూచించింది. ఆ క్రమంలోనే బిడ్స్ కూడా అందాయి.

02/09/2020 - 01:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కార్పొరేట్ సెక్టార్ నుంచి డిమాండ్ పెరగడంతో 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌ఐఐటీ కన్సాలిడేటెడ్ నికర లాభం 40 శాతం వృద్ధితో రూ. 27.1 కోట్లకు పెరిగింది. ఈ సంస్థ 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 19.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. నైపుణ్యాలు, ప్రతిభను అభివృద్ధి చేయడంలో ఒక గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఎన్‌ఐఐటీ ఈ వివరాలు వెల్లడించింది.

02/09/2020 - 01:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) నికర లాభం 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నాలుగింతలకు పైగా వృద్ధితో రూ. 382.98 కోట్లకు పెరిగింది. అధికాదాయం వల్ల నికర లాభం పెరిగిందని ఆ సంస్థ తెలిపింది. అదాని గ్రూప్‌లోని ప్రధాన సంస్థ అయిన ఏఈఎల్ సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 80.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

02/09/2020 - 01:50

ముంబయి, ఫిబ్రవరి 8: స్టాక్ మార్కెట్లు ఈవారం దూకుడును కొనసాగించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకటో తేదీన లోక్‌సభలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్ వర్గాల్లో కొత్త జోష్ కనిపించింది. మదుపరులు వాటాల కొనుగోళ్లకు ఆసక్తిని ప్రదర్శించడంతో బుల్ రన్ కొనసాగింది.

Pages