S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/20/2017 - 00:47

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సరళీకృత వ్యాపార విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ నేతృత్వంలో శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇప్పటికే 372 సంస్కరణలను ప్రతిపాదించామని, వీటిలో 315 సంస్కరణలు అమల్లోకి వచ్చాయని సింగ్ గుర్తు చేశారు.

08/20/2017 - 00:46

హైదరాబాద్, ఆగస్టు 19: ఆధార్ నమోదు, అప్‌గ్రేడ్ చేసే సదుపాయాన్ని ప్రారంభించిన దేశీయ తొలి ప్రైవేట్ రంగ బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్. చెన్నైలోని నెల్సన్ మాణిక్యం రోడ్ బ్రాంచ్‌లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించి ఈ ఘనతను సాధించింది. ఆధార్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ శాఖల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆధార్ నమోదు, అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని సూచించింది.

08/20/2017 - 00:45

హైదరాబాద్, ఆగస్టు 19: దేశాభివృద్ధిలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర వహిస్తోందని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ-దక్షిణాది) ఉపాధ్యక్షుడు ఆర్ చలపతిరావు అన్నారు. స్థిరాస్తి రంగం వృద్ధి చెందితే ఆర్థిక అభివృద్ధి కాకుండా ఉపాధి అవకాశాలూ భారీగా పెరుగుతాయని చెప్పారు.

08/20/2017 - 00:45

హైదరాబాద్, ఆగస్టు 19: బీడీ పరిశ్రమను వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి రక్షించేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. జిఎస్‌టి బీడీ పరిశ్రమ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందని పేర్కొన్నారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో బీడీ పరిశ్రమ యాజమాన్యాలతో కెటిఆర్ శనివారం సమావేశం అయ్యారు.

08/20/2017 - 00:43

ఒంగోలు, ఆగస్టు 19: పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పొగాకు శాతాన్ని పరిశీలిస్తే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 65 శాతం పొగాకు ఉత్పత్తి అవుతోంది.

08/19/2017 - 00:14

ముంబయి, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో గత మాడు రోజులుగా లాభాల బాటలో సాగిన ప్రధాన సూచీలు వారాంతపు రోజయిన శుక్రవారం నాడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం బలహీనంగా మొదలయిన మార్కెట్లకు ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి సిక్కా రాజీనామా వార్త శరాఘాతమైంది.

08/19/2017 - 00:13

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశీయ ఐటి రంగ ప్రముఖుల్లో ఒకరైన ఇన్ఫోసిస్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా తన పదవుల నుంచి తప్పుకున్నారు. ఇన్ఫోసిస్‌కు తొలి వ్యవస్థాపకేతర సిఇఓగా సేవలు అందించిన ఆయన తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేశారు. సిక్కాపై సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ ఎన్‌ఆర్.నారాయణ మూర్తి విమర్శల దాడిని కొనసాగించడమే ఆయన రాజీనామాకు కారణమని ఇన్ఫోసిస్ శుక్రవారం వెల్లడించింది.

08/19/2017 - 00:10

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఇఓ, ఎండి పదవులకు విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ)గా సేవలందిస్తున్న ప్రవీణ్ రావును తాత్కాలిక సిఇఓగా నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

08/19/2017 - 00:09

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామాతో ఆ కంపెనీ షేరు ఒక్కసారిగా పేకమేడలా పతనమైంది. బిఎస్‌ఇలో ఒక దశలో ఆ కంపెనీ షేరు 13.39 శాతం పడిపోయి 52 వారాల కనిష్టస్థాయి అయిన రూ.884.40 స్థాయికి దిగజారింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకొన్నప్పటికీ చివరికి 9.6 శాతం నష్టంతో రూ. 923.10 వద్ద ముగిసింది.

08/19/2017 - 00:08

బెంగళూరు, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసినప్పటికీ బైబ్యాక్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని కంపెనీ శుక్రవారం స్పష్టం చేసింది. షేర్ల బైబ్యాక్ ద్వారా వాటాదారులకు రూ. 13 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కల్పించాలని ఇన్ఫోసిస్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కంపెనీ బోర్డు శనివారం సమావేశం కావలసి ఉంది.‘బైబ్యాక్ ప్రణాళికలో ఎలాంటి మార్పూ లేదు.

Pages