S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/30/2017 - 06:22

ముంబయి, మార్చి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 121.91 పాయింట్లు పెరిగి 29,531.43 వద్దకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు అందుకుని 9,143.80 వద్ద నిలిచింది. ఎఫ్‌అండ్‌ఒ గడువు ముగిసిపోతున్నా మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు.

03/30/2017 - 06:22

హైదరాబాద్, మార్చి 29: సింగరేణి తన గత రికార్డులను అధిగమిస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకేరోజు 2.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, 43 రేక్‌లలో రవాణా చేసినట్లు ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు, అధికారులను ఆయన అభినందించారు.

03/29/2017 - 00:53

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. జన్‌ధన్ ఖాతాల నిర్వహణ వ్యయం 775 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.

03/29/2017 - 00:52

న్యూఢిల్లీ, మార్చి 28: నిర్మాణరంగ సంస్థ పురవంకర.. హైదరాబాద్‌లోని 19 ఎకరాల భూమిని అమ్మేసింది. 475 కోట్ల రూపాయలకు ఔషధరంగ సంస్థ అయిన హెటిరో గ్రూప్‌నకు విక్రయించింది. రుణ భారం తగ్గించుకోవడానికి, స్థిరాస్తుల నగదీకరణ వ్యూహంలో భాగంగానే బెంగళూరుకు చెందిన పురవంకర ఈ అమ్మకానికి దిగింది. ఈ మేరకు పురవంకర లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ పురవంకర పిటిఐకి తెలిపారు.

03/29/2017 - 00:51

హైదరాబాద్, మార్చి 28: టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎస్‌ఎల్) భాగస్వామ్యంతో టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్.. ఎమ్-ఇన్సూరెన్స్‌ను ప్రారంభించింది. దీనివల్ల ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా సదుపాయం లభించగలదని సంస్థ తెలిపింది. ఎంపిక చేసిన రీచార్జ్‌లపై టిటిఎస్‌ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఎమ్-ఇన్సూరెన్స్..

03/29/2017 - 00:50

ముంబయి, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 172.37 పాయింట్లు పెరిగి 29,409.52 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.60 పాయింట్లు పుంజుకుని 9,100.80 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలతో సోమవారం దేశీయ సూచీలు నష్టపోయినది తెలిసిందే.

03/29/2017 - 00:50

ముంబయి, మార్చి 28: బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ.. మంగళవారం నూతన థర్డ్ పార్టీ మోటార్ ప్రీమియం రేట్లను ప్రకటించింది. 1 లీటర్-1.5 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ప్రైవేట్ వాహనాల ప్రీమియం ధరను అత్యధికంగా 41 శాతం పెంచింది. కొత్త ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రీమియం ధర 3,132 రూపాయలకు చేరింది. ఇప్పుడు 2,237 రూపాయలుగానే ఉండటం గమనార్హం.

03/29/2017 - 00:49

కాకినాడ, మార్చి 28: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి మానవ వనరుల అవసరం చాలా ఉందని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌డిసి) డైరెక్టర్ డాక్టర్ గంటా సుబ్బారావు స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా ఎక్కువగా పెట్రో కెమికల్, పెట్రో కారిడార్, షిప్ బిల్డింగ్, స్మార్ట్‌సిటీలు, ఐటి రంగం, ఆధునిక రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

03/29/2017 - 00:47

న్యూఢిల్లీ, మార్చి 28: వచ్చే జూలై 1 నుంచి భూముల లీజు, భవనాల అద్దె, నిర్మాణంలో ఉన్న గృహాల కొనుగోళ్లకు చెల్లించే నెలసరి వాయిదా (ఇఎమ్‌ఐ)లు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి రానున్నాయి. అయినప్పటికీ భూములు, భవనాల అమ్మకాలు మాత్రం జిఎస్‌టి పరిధిలోకి రావు. వీటికి స్టాంప్ డ్యూటీనే వర్తించనుంది.

03/29/2017 - 02:16

హైదరాబాద్, మార్చి 28: భారత్-అమెరికా మధ్య సాలీనా 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వర్తక సంబంధాలు బలంగా ఉన్నాయని ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయాధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాసన్ అన్నారు.

Pages