S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/20/2017 - 02:34

తడ, జనవరి 19: నెల్లూరు- చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ సెజ్‌ను గురువారం కేంద్ర ప్రభుత్వం కామర్స్,పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ విభాగం జాయింట్ సెక్రటరీ వందనకుమార్ సందర్శించారు. ఈమెకు ఎండి రవీంధ్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి శ్రీసిటీ పారిశ్రామికంగా సాధించిన అభివృద్ధి, ప్రగతి గురించి వివరించారు.

01/20/2017 - 02:33

హైదరాబాద్, జనవరి 19: ఐటి నిపుణులు ఫణీశ్ మూర్తి సిగ్నిటీ టెక్నాలజీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు ఆ సంస్ధ తెలిపింది. ఫణీశ్‌కు ఐటి రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉందని, ఫార్చూన్ 500 కంపెనీల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఉందన్నారు. ఈ విషయాన్ని సిగ్నిటీ ఎండి సివి సుబ్రహ్మణియమ్ చెప్పారు.

01/20/2017 - 02:33

న్యూఢిల్లీ, జనవరి 19: దేశంలోని ప్రముఖ తనఖా రుణ సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ తమ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించింది. ప్రస్తుతమున్న ఖాతాదారులకు వర్తించే ఈ వడ్డీ రేటు తగ్గింపు గురువారం నుంచే అమల్లోకి వస్తుందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తగ్గించిన రుణ వడ్డీ రేటు ప్రవాస భారతీయులతో పాటు పిఐఓ కార్డులు కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

01/20/2017 - 02:31

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఇండియా లిమిటెడ్ ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యువి ‘ఎకోస్పోర్ట్’కు అప్‌గ్రేడెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కె ట్లో ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 10.39 లక్షల నుంచి 10.69 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎకోస్పోర్ట్ ‘ప్లాటినమ్ ఎడిషన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

01/19/2017 - 07:03

దావోస్, జనవరి 18: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో దక్షిణాసియా దేశాలు కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యుఇఎఫ్)లో పాల్గొన్న ఆమె బుధవారం మాట్లాడుతూ బలమైన ఆర్థిక వృద్ధిరేటు, గణనీయంగా పెరుగుతున్న కొనుగోళ్ల సామర్థ్యంతో దక్షిణాసియా దేశాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయన్నారు.

01/19/2017 - 06:02

ముంబయి, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21.98 పాయింట్లు పెరిగి 27,257.64 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు అందుకుని 8,417 వద్ద నిలిచింది.

01/19/2017 - 06:02

విజయవాడ, జనవరి 18: ఉల్లి రైతులు నష్టాలబారినపడ్డారు. గిట్టు బాటు ధరలేక కుదేలైపోయారు. కృష్టా జిల్లా పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లోని ఉల్లి రైతులు ఈ ఏడాది నష్టాలను చవిచూస్తుండగా, పెరిగిన పెట్టుబడులు, సరైన ధర లేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. అమరావతి రాజధాని పరిధిలో భూ సమీకరణకు ప్రతిపాదించిన గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి ప్రాంతాల్లో దాదాపు 1.000 ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తున్నారు.

01/19/2017 - 06:01

న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని ప్రభుత్వరంగ బీమా సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఐదు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

01/19/2017 - 05:59

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధి కార్పొరేషన్ (టిఎస్‌టిడిసి) చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. బుధవారం సోమాజిగూడలోని పర్యాటక భవన్‌లో ఇటీవల సోషల్ మీడియా ఫోరం బృందం చేసిన పరిశోధన యాత్ర వివరాలను వెల్లడించారు.

01/19/2017 - 05:58

హైదరాబాద్, జనవరి 18: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మారిషస్ సంస్థకు అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని, ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

Pages