-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ జియోపై ప్రత్యర్థి సంస్థలు ఒక్కొక్కటిగా టెలికామ్ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టిడిశాట్)ను ఆశ్రయిస్తున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంచలన టెలికామ్ సంస్థ 4జి సేవలను దేశవ్యాప్తంగా ఉచితంగానే అందిస్తున్నది తెలిసిందే. అయితే ఈ ఉచిత ఆఫర్ను తొలుత గత నెల డిసెంబర్ 31 వరకే ప్రకటించిన జియో.. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించింది.
దావోస్, జనవరి 17: ఆశాజనక మార్కెట్లలో భారత్ టాప్-5లో స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ఆరో స్థానానికి పడిపోయింది. కన్సల్టెన్సీ దిగ్గజం పిడబ్ల్యుసి నిర్వహించిన వార్షిక గ్లోబల్ సిఇఒల అధ్యయనం ప్రకారం ఈ జాబితాలో అమెరికా 43 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి నాలుగు స్థానాల్లో చైనా (33 శాతం), జర్మనీ (17 శాతం), బ్రిటన్ (15 శాతం), జపాన్ (8 శాతం) ఉన్నాయి.
జపాన్కు చెందిన ఆటోరంగ దిగ్గజం నిస్సాన్.. మంగళవారం భారతీయ మార్కెట్కు సరికొత్త సన్నీ కారును పరిచయం చేసింది. ఎక్స్షోరూం ఢిల్లీ ప్రకారం దీని కనిష్ట ధర 7.91 లక్షల రూపాయలుగా, గరిష్ఠ ధర 10.89 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కొత్త వెర్షన్.. కస్టమర్లను మరింత ఆకట్టుకోగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా నిస్సాన్ వ్యక్తం చేసింది.
ఆసియాలోనే అత్యంత ప్రాచీన స్టాక్ ఎక్స్చేంజైన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ధర ఆకర్షణీయంగా ఉందని బ్యాంకర్లు అన్నారు. సంస్థాగత మదుపరుల నుంచి మంచి స్పందన వచ్చే వీలుందని ముంబయిలో మంగళవారం మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. బిఎస్ఇ ఐపిఒలో ఒక్కో షేర్ ధరను 805-806 రూపాయలుగా నిర్ణయించారు. 1,243 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకు బిఎస్ఇ దిగుతోంది.
మంగళవారం దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త స్మార్ట్ఫోన్ను సామ్సంగ్ తీసుకొచ్చింది. గెలాక్సీ సి9 ప్రో పేరిట వచ్చిన దీని ధర 36,900 రూపాయలు. సామ్సంగ్ ఫోన్లలోనే తొలిసారిగా 6 జిబి ర్యామ్ దీని సొంతం. ఆసక్తిగల కస్టమర్లు ఈ నెల 27 నుంచి ఎంపిక చేసిన స్టోర్లు, ఆన్లైన్ వేదికల ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి
ముంబయి, జనవరి 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మంగళవారం ఓ అంతర్జాతీయ బాండ్ల విక్రయం ద్వారా 500 మిలియన్ డాలర్ల (దాదాపు 3,500 కోట్ల రూపాయలు) నిధులను సమీకరించింది. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లకు విదేశీ మదుపరుల నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. మూడు రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ కావడం విశేషం.
హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్తో ప్రముఖ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ జట్టు కట్టింది. టి-హబ్ సహకారంతో ‘యెస్ ఫిన్టెక్’ అనే ఓ బిజినెస్ యాక్సలేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో అంకుర సంస్థల (స్టార్టప్) వృద్ధిని వేగవంతం చేసే వేదిక అయిన అంతిల్కూ భాగస్వామ్యం ఉంది.
హైదరాబాద్, జనవరి 17: పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్) ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు దక్కిన నంబర్-1 స్థానాన్ని ఇక ముందుకూడా పదిలపర్చుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రానికి నంబర్-1 స్థానం దక్కడానికి అన్ని శాఖల అధికారుల కృషి ఫలితమేనని సింగ్ కొనియాడారు.
ముంబయి, జనవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తగ్గించిన నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. దేశ జిడిపి వృద్ధిరేటు ఈసారి 6.6 శాతానికే పరిమితం కాగలదని సోమవారం ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. అంతకుముందు ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ..
హైదరాబాద్, జనవరి 17: చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని సత్తుపల్లి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ చిన్నత రహా గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను, గనులు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.