S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/03/2016 - 01:04

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోగల రెండవ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రక్రియ విజయవంతమైనట్లు సింగరేణి ఎండి ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ధరకే 1,200 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామన్నారు.

12/03/2016 - 01:03

హైదరాబాద్, డిసెంబర్ 2: ఐటి రంగానికి విశిష్ట సేవలు అందించిన సియాంట్ వ్యవస్థాపకుడు, నాస్కాం పూర్వ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన పయోనీరింగ్ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. ఢిల్లీలో శుక్రవారం ఆరవ నేషనల్ బిపిఎం షేర్డ్ సర్వీసెస్ సదస్సులో ఈ అవార్డును బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రదానం చేశారు.

12/03/2016 - 01:03

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.26 పాయింట్లు క్షీణించి 26,230.66 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 106.10 పాయింట్లు పతనమై 8,086.80 వద్ద నిలిచింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఇటలీ రాజ్యాంగ రెఫరెండమ్‌పై మదుపరులు భయాలకు లోనవడంతో సూచీ లు నష్టాలకు గురయ్యాయి.

12/03/2016 - 01:02

ముంబయి, డిసెంబర్ 2: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సిఇఒ, ఎండిగా శుక్రవారం చిత్రా రామకృష్ణ తప్పుకున్నారు. 2018 మార్చి వరకు ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఇ బోర్డులోని కొందరు సభ్యులతో నెలకొన్న విభేదాల మధ్య ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. 2013 ఏప్రిల్‌లో సిఇఒ, ఎండిగా చిత్రా రామకృష్ణ ఎంపికయ్యారు. మరోవైపు ఆమె స్థానంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జె రవిచంద్రన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.

12/03/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 17,993 కోట్ల రూపాయలుగా ఉన్నాయని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా సమర్పించిన వివరాల ప్రకారం 2015-16లో 28 ప్రభుత్వరంగ బ్యాంకులు 17,993 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి.

12/03/2016 - 01:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ అధికారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిని బదిలీ చేసింది. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ వీరంతా నల్లధనం మార్పిడికి పాల్పడుతున్నట్లు ఐటి శాఖ దాడుల్లో గుర్తించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

12/03/2016 - 00:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తన సంపదలో 99 శాతం కోల్పోయిన బిలియనీర్ ఎవరూ కూడా సంతోషంగా ఉండరు. కానీ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసయోషి సన్ మాత్రం ఇందుకు భిన్నం. అవును.. తన సంపద క్షీణతతో తాను పనిలో ఉన్న ఆనందం, ధనం విలువను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన తన అంతరంగాన్ని ఆహుతులతో పంచుకున్నారు.

12/03/2016 - 00:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ నూతన సేవింగ్స్ ఖాతాదారులకు టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ఒక నిమిషం టాక్‌టైమ్ (తమ నెట్‌వర్క్ పరిధిలోనే)ను ఇస్తోంది. ఈ అవకాశం తొలిసారి డిపాజిట్లకే ఉంటుం ది.

12/02/2016 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిన్నమొన్నటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు.

12/02/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో భారత్, చైనా దేశాలు పాజిటివ్ ఔట్‌లుక్‌తో నిలుస్తాయని గురువారం ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఒకటి తెలిపింది. ప్రగతిశీల పన్ను విధానాలు, ప్రభావవంతమైన ఆర్థిక సుపరిపాలనతో ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే భారత్, చైనాలు ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నాయని ఆ అధ్యయనంలో ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.

Pages