-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, డిసెంబర్ 1: ఉచిత వాయిస్ కాల్స్, డేటా వినియోగం ఆఫర్ను మార్చి 31 వరకు పొడిగించింది రిలయన్స్ జియో. ‘జియో హ్యాప్పీ న్యూ ఇయర్’ పేరిట ఉచిత వాయిస్, డేటా, వీడియో, అప్లికేషన్ల సదుపాయాన్ని తమ కస్టమర్లకు మూడు నెలలపాటు పెంచింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ ఉచిత ఆఫర్ తొలుత డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించిన జియో.. దాన్ని ఇప్పుడు మార్చి 31 వరకు తీసుకెళ్లింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మారుతి సుజుకి, టొయోటా, రెనాల్ట్ అమ్మకాలు గత నెల నవంబర్లో రెండంకెల వృద్ధిని అందుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోనూ దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగడం గమనార్హం. మరోవైపు మహీంద్ర, ఫోర్డ్, హోండా అమ్మకాలు పడిపోయాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు ప్రకటించింది. కాగా, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు ఈసారి 1,26,325 యూనిట్లుగా నమోదయ్యాయి.
ముంబయి, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో వరుసగా నాలుగు రోజులపాటు నమోదైన లాభాలకు తెరపడింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెనె్సక్స్ 92.89 పాయింట్లు క్షీణించి 26,559.92 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 31.60 పాయింట్లు కోల్పోయి 8,192.90 వద్ద నిలిచింది.
హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్ఐఐసి) ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. దీన్ని టిఎస్ఐఐసి చైర్మన్ జి బాలమల్లు గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
కొత్తగూడెం, డిసెంబర్ 1: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ తడబాటు పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 66.03 మిలియన్ టన్నులవగా, గడచిన ఎనిమిది మాసాలలో 4 కోట్ల 7 లక్షల 45 వేల 200 టన్నులు ఉత్పత్తికిగాను.. 3 కోట్ల 64 లక్షల 73 వేల 655 టన్నులు మాత్రమే సాధించి నవంబర్ మాసం ముగిసే సమయానికి 90 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది.
రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పాత పెద్ద నోట్ల రద్దు సంక్షోభం నేపథ్యంలో ప్రసిద్ధిచెందిన తూర్పు గోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్ వ్యాపారుల పరిస్థితి ‘పూలు అమ్మినచోటే..’ అన్నట్టుగా తయారైంది. పూలతోపాటు మొక్కల ఎగుమతులకు దేశవ్యాప్తంగా పేరొందిన కడియపులంకలో కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పూల మార్కెట్కు కరెన్సీ కష్టాలు ఆవరించడంతో పూల రైతులు కుదేలయ్యారు. ఎగుమతులు లేకపోవడంతో కుళ్లిపోతున్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 30: జాతీయ రహదారులపై టోల్గేట్ వసూళ్లు మళ్లీ మొదలవుతున్నాయి. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి టోల్గేట్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు టోల్గేట్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది తెలిసిందే. కాగా, డిసెంబర్ 15 వరకు పాత 500 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముంబయి, నవంబర్ 30: అంతర్జాతీయ మార్కెట్లో పుంజుకున్న చమురు ధరలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 258.80 పాయింట్లు పెరిగి 26,652.81 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 82.35 పాయింట్లు అందుకుని 8,224.50 వద్ద నిలిచింది.
హైదరాబాద్, నవంబర్ 30: ఆఫ్రికా దేశంలో ఉక్కు తదితర పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వోల్టా ఇంపెక్స్ సంస్థ చైర్మన్, తెలుగువారైన ఎంఎస్ఆర్వి ప్రసాద్కు ప్రతిష్ఠాత్మకమైన అసోచామ్ అవార్డులను ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్ ఈ అవార్డులను ఎంఎస్ఆర్వి ప్రసాద్కు ప్రదానం చేశారు.
విజయవాడ, నవంబర్ 30: పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో వాణిజ్య పన్నుల శాఖలో నవంబర్ నెల ఇ-చెల్లింపులు పెరిగాయి. ఈ శాఖలో లావాదేవీలు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనలో భాగంగా నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.