S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరాయణం
‘రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్’ ఒప్పందం విషయమై భారత్ వ్యతిరేకించడం, వైదొలగడం సరైన చర్య. 16 ఆసియా పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని నెలకొల్పేదిశగా 2013 నుండి ప్రతిపాదనల్లో వున్న ఒప్పందం ఖరారైతే భారత్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ రీతిలో ఉండేది. ప్రపంచ జనాభాలో సగం మంది నివసిస్తున్న ఈ దేశాల గ్రూపులో ప్రపంచ వాణిజ్యం మొత్తంలో 40 శాతం నడుస్తూ వుంది.
నోరూరించే వివిధ రకాల పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వేసవిలో మామిడి, మిగతా సీజన్లలో తర్బూజ, బొప్పాయి, అరటిపండ్లు బంగారు వర్ణంలో మన కళ్లు చెదిరేలా మెరిసిపోతుంటాయ. లేత నారింజ, ఎరుపు రంగుల సమ్మేళనంతో సపోటా ఎంతో ఇంపుగా కనిపిస్తుంది. యాపిల్ పండు చీకటిలో పెట్టెనా ఎరుపు రంగుతో వెలిగిపోతుంది. పండ్లు ప్రతినిత్యం తింటే ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు. అలాగని తియ్యతియ్యని పండ్లు తినేద్దామనుకుంటున్నారా?
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కరవుభత్యం పెంచిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం కూడ తమ ఉద్యోగులకు, లక్షలాది మంది పెన్షనర్లకు కూడ దాన్ని పెంచే ఆనవాయితీ కొనసాగుతూ వున్నది. గత ప్రభుత్వం పదకొండవ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) అమలులోకి వచ్చేదాక తాత్కాలిక భృతిని 20 శాతంగా ప్రకటించి, ఆ మేరకు జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. జనవరి 2018కి సంబంధించి డీఏ సైతం ఇచ్చారు. జూలై 2018 నుంచి ఇవ్వవలసిన డీఏ ఆగిపోయింది.
నేడు మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కార్మికుల, ఉద్యోగుల సమ్మెలను వ్యతిరేకించటం, అధికారం లేనిచోట బేషరతు మద్దతులు పలకటం పరిపాటిగా మారింది. ప్రజాప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే నేతలకు ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కింది తరగతి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా వుండేది.
‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం మన దేశం 112 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. పిల్లల ఎదుగుదల, పౌష్టికాహార లభ్యత, శిశుమరణాల రేటు ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్లను ఏటా ఇస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలలు వయసుకుతగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తుకి ఎదగక పోవడం లాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం కూడా మన దేశంలో బాలల ఆరోగ్యం తీసికట్టుగానే ఉంది.
ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు విద్యాసంవత్సరం మొదలై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రెండు జతల ఉచిత యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) రాకపోవడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ బడులలో బడుగు, బలహీనవర్గాల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు.
లాంచీలను పరిశీలించకుండా పర్యాటక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో నదుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరద హెచ్చరికలను లెక్కచేయకుండా ధనార్జనే ధ్యేయంతో లాంచీలను నడపటంతో ఇటీవల పాపికొండల యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా వేరే మార్గంలో గోదావరిలో బోటు నడపడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుండి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే ‘సమాచార హక్కు’. పాలనలో పారదర్శకతను పెంచి అవినీతిని అరికట్టేదే సమాచార హక్కు చట్టం. భారత ప్రభుత్వం అక్టోబర్ 12, 2005 తేదీన సమాచార హక్కు చట్టాన్ని దేశం అంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులెవరైనా పొందవచ్చు.
‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ సంస్థ తొలిసారిగా 1992 అక్టోబర్ 10వ తేదీన ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ నిర్వహించింది. 1994 నుండి ప్రతి సంవత్సరం మానసిక ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. మన ఆలోచనలు, ఆచరణలు అన్ని మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడు గనుక లేకుంటే ఇంజన్ లేని రైలులా, దారం లేని గాలిపటంలా మానవ శరీరం ఉంటుంది.
దేశమంతటా ఒకే భాష సాధ్యమేనా? పలు ప్రాచీన భాషలకు, విభిన్న సం స్కృతులకు నిలయమైన మన దేశంలో అది సాధ్యం కాదు. ‘ఒకే దేశం-ఒకే భాష’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో జాతీయభాషపై మరోసారి చర్చకు తెర లేచింది. ‘యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా మనకు విశిష్ట గుర్తింపు ఉండేలా ఒకే భాష ఉండాలి.