S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరాయణం
పశ్చిమ బెంగాల్లో రాజధాని నడిబొడ్డున ఉన్న వైద్య కళాశాలలో ఇద్దరు జూనియర్ వైద్యులపై రోగి బంధువులు దాడి జరపడం అమానుషం. ఒక వృద్ధుడైన రోగి మరణానికి వైద్యుల్ని బాధ్యుల్ని చేస్తూ రోగి బంధువులు భౌతిక దాడికి, ఆస్పత్రిలో హింసకు పాల్పడడం ఒక ఎత్తయితే, దెబ్బలు తిన్న వైద్యుల పైనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడడం మరింత ఆందోళనకరం.
ప్రపంచంలోనే మనది భారీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని గొప్పలు చెప్పుకొని నేతలు పబ్బం గడుపుకోవడం మన జాతి చేసుకున్న దురదృష్టం.
నిరుద్యోగం గత ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని స్థాయికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంచనాలకు మించి శరవేగంగా నిరుద్యోగం పెరిగింది.
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను 6 నెలల్లోగా భర్తీ చేయాలని యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్లోని మోడల్ హైస్కూళ్ల ప్రాజెక్ట్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది సమస్యలు ప్రభుత్వ స్థాయిలో మాత్రమే పరిష్కారం అవుతాయి. సర్వీస్ నిబంధనలు, కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి న్యాయమైన కోర్కెలను కొత్త ప్రభుత్వమైనా పరిశీలించాలి. ప్రతి మండలంలో మోడల్ హైస్కూళ్లను ఏర్పాటు చేయాలనుకొన్నా, 164 మండలాలకు మాత్రమే ఇవి పరిమితమయ్యాయి.
ప్రజలకు ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైన సొంత ఇళ్లను సమకూర్చడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. 2017 నాటి జాతీయ సామాజిక సర్వే ప్రకారం దేశంలో కేవలం 45శాతం మందికి మాత్రమే స్వంత ఇంటి కల సాకారమయ్యింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో సొంతిల్లు అనేది నేటికి మధ్య, దిగువ తరగతి ప్రజలకు ఒక కలగా మిగిలిపోవడం బాధాకరం.
2014లో ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ప్రధాని మోదీ సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు. తాజాగా బింస్టెక్ కూటమి నేతలను ఆహ్వానించడం ఆయన వ్యూహాత్మక వైఖరి, ముందుచూపు, సువిశాల విదేశాంగ విధానాన్ని సూచిస్తోంది. సార్క్ కూటమిలో సభ్యత్వం ఉన్న పాకిస్తాన్ను ఏకాకిని చేయడానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ట వ్యూహం ఇప్పటికే సత్ఫలితాలనిచ్చింది.
చరిత్రలో కొన్ని శుభకరమైన రోజులు ఉంటాయి. కొన్ని అశుభకరమైన రోజులూ ఉంటాయి. శుభములు పొందిన ప్రజలు ఆ రోజున పండుగ చేస్తారు. అశుభములు కలిగిన ప్రజలు అలాంటి రోజున ఆవేదనలు గుర్తుచేసుకుంటారు. చిత్రమేమిటంటే- దేశ చరిత్రలో ఒకే రాష్ట్రంగా బతుకుతున్న తెలుగు ప్రజలను విడదీసి కొందరికి మంచిని, ఇంకొందరికి చెడ్డను మిగిల్చిన రోజు అది.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వం, ముందుచూపు, దార్శనికత, ప్రజాసంక్షేమం, దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసిన వైనం కారణంగా ప్రజలు ఎన్డిఏకి మరొకసారి అత్యద్భుతమైన విజయం అందించారు. భాజపా సునామీలో జాతీయ పార్టీలన్నీ దాదాపుగా కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వరుసగా రెండవసారి లోక్సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ స్వయంకృతాపరాధం.
లోక్సభ ఎన్నికల్లో భాజపా అఖండ మెజారిటీ సాధించడాన్ని చూస్తే ఇదంతా మోదీ మహిమేనని సర్వత్రా వినపడుతున్న మాట. మోదీకి దీటైన రీతిలో ప్రధాని అభ్యర్థిగా విపక్ష కూటముల నుంచి ఎవరూ.. ఆ స్థాయి సమర్థతతో కనిపించకపోవడం ఈ విజయానికి మరో కారణం.