S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

08/06/2019 - 01:52

ప్రపంచంలోనే అతిపెద్ద ‘రియాల్టీ షో’ అంటూ ‘బిగ్‌బాస్’ను ఎలక్ట్రానిక్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్‌బాస్’ మూడో ఎడిషన్‌ను చూస్తుంటే ఇంతటి వేలం వెర్రి ఎందుకోసం? అనిపిస్తుంది. ఏది శృంగారమో, ఏది బూతో తెలియదు గాని- ఎవరి మనసును వారు జడ్జిమెంట్‌ను అడగాలి. బిగ్‌బాస్‌లో కంటపడిన దృశ్యాలు అశ్లీలంగానూ ఉంటున్నాయి. ‘అరటి బోదెల వంటి తొడలు..’ అనే వర్ణనలను ఒకప్పుడు శృంగార కావ్యాలలో చూశాము.

08/02/2019 - 22:05

నేడు వ్యవసాయం పెనుభారమై భూస్వాములు, మధ్య తరగతి రైతులు పట్టణాలకు వలసపోతూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో పుడమితల్లిని నమ్ముకొని, మరో ప్రత్యామ్నాయం లేనందున కౌలురైతులు మాత్రం వ్యవసాయాన్ని వదులుకోలేక పోతున్నారు. ఇప్పుడు కాకుంటే కొన్నాళ్లకైనా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు చేతికి అందివస్తాయన్న ఆశతో వీరు ఇతరుల భూములను కౌలుకు తీసుకొని కాలక్షేపం చేస్తున్నారు.

08/01/2019 - 04:48

నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జూన్ 18వ తేదీ నాటికి దేశంలో 3.5 కోట్లకు పైగా వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయి. సివిల్ కేసులు 89 లక్షలు, క్రిమినల్ కేసులు 2.6 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న సిబ్బంది, వౌలిక సదుపాయాలను అనుసరించి చూస్తే ఈ కేసులన్నింటినీ పరిష్కరించేందుకు అరవై సంవత్సరాలు పడుతుందని జాతీయ లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది.

07/30/2019 - 02:12

అర్ధ శతాబ్దంపాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రాజకీయ దురంధరుడు, మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ కేంద్ర మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా ముద్దుబిడ్డ సూదిని జైపాల్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువాత పడడం తెలంగాణ సమాజానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రజాసేవకుడు, పాలనాదక్షుడు, మంచి వక్తను కోల్పోయింది.

07/25/2019 - 01:57

ఈ మధ్య ఐరోపాలోని పోలండ్, చెక్ రిపబ్లిక్‌ల్లో జరిగిన పరుగుపందేల్లో ఐదు స్వర్ణ పతకాలు సాధించి మన దేశం గర్వించేలా ప్రతిభ చూపారు హిమాదాస్. అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీలో ఒకేనెలలో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం ఎంతటి గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు.

07/24/2019 - 01:41

ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. కానీ, మానవుడు తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా నిధులు ఖర్చు చేస్తున్నా సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.

07/21/2019 - 02:16

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో జరుగుతాయని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షలు పోస్టులను భర్తీచేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆయన మాటలు నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి.

07/16/2019 - 22:30

నీటిఎద్దడి శరవేగంగా విస్తరిస్తున్న దేశం మనది. పట్టణాలు, పల్లెలు నానాటికీ ‘నిర్జల ప్రదేశాలు’గా మారిపోతున్నాయి. వర్షాకాలం వచ్చినా చెన్నై పట్టణానికి రైళ్లలో మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోందంటే నీటి కొరత ఎంత తీవ్రరూపం దాల్చిందో అవగతమవుతుంది. రానున్న రెండేళ్లలో మరో ఇరవై ఒక్క పట్టణాలు ఇదే బాట పట్టనున్నాయని అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి.

07/10/2019 - 21:56

అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతుండగా మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండడం దురదృష్టకరం. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన వుంది.

07/10/2019 - 02:43

మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుండి ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా బ్యాంకులు, పోస్ట్ఫాసులు సామాన్యుల పొదుపు డిపాజిట్లపై క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోని వడ్డీలతో పోల్చి, కార్పొరేట్ వర్గాల వత్తిడితోను, మన దేశం ఆర్థికంగా ఎదిగిందని ఇలా తగ్గిస్తున్నాయి.

Pages