S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, డిసెంబర్ 10: షాపూర్నగర్లో భారీ చోరీ జరిగింది. అనంతపురానికి చెందిన రత్న శేఖర్రెడ్డి కొంతకాలం క్రితం నగరానికి వచ్చి షాపూర్నగర్లోని హెచ్ఎంటి సొసైటీలో స్థిరపడ్డాడు. బడావ్యాపారస్థుడైన రత్న శేఖర్రెడ్డి అనంతపురంలో వ్యాపార నిమిత్తం వారానికి రెండు, మూడుసార్లు వెళ్లి వస్తుంటాడు.
హైదరాబాద్, డిసెంబర్ 10: దేశంలో వ్యక్తిగత కంప్యూటర్లు మొదలుకొని భారీ వ్యవస్థ (సంస్థలు)లపై జరిగే సైబర్ దాడులను పసిగట్టే పనిని ప్రముఖ ‘టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం’ ప్రారంభించింది.
హైదరాబాద్, డిసెంబర్ 10: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది. శుక్రవారం అర్థరాత్రి వరకు తొమ్మిది మృతదేహాలను బయటకు తీసిన ఎన్డిఆర్ఎఫ్, పోలీసు బృందాలు ఆ తర్వాత తెల్లవారుఝము నాలుగు గంటల వరకు మరో రెండు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, ఉస్మానియా ఆసుపత్రి నుంచి అయిదు అంబులెన్స్లలో వారి స్వస్థలాలకు తరలించారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు నిలదీయడం లేదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ నాయకుడు జివిజి.నాయుడు శనివారం తన అనుచరులతో కలసి టిడిపిలో చేరారు.
మహబూబాబాద్ టౌన్, డిసెంబర్ 10: ఈ విద్యాసంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇంతవరకు బిఈడి తరగతులు ప్రారంభం కాలేదు. అసలు క్లాసులు జరుగుతాయా, జరుగవో ఏమి తెలియని దిక్కుతోచని స్థితిలో విద్యార్థు లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిఈడి విద్యార్థిని విద్యార్థులను పట్టించుకునే పాపాన పొలేదు. గతంలో బిఈడి కోర్సు ఒక సంవత్స రం ఉండగా ఈ యేడాది నుండి దాని ని రెండు సంవత్సరాలకు పెం చారు.
వరంగల్, డిసెంబర్ 10: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించటం ద్వారా ప్రజ లు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ మహానగరపాలక సంస్థ కమీషనర్ శృతి ఓఝా అధికారులను ఆదేశించారు. నగరంలోని ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిచుకోవటం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత ప్రాం తాలుగా అభివృద్ధి చెందేలా చూడాలని చెప్పారు.
జనగామ టౌన్, డిసెంబర్ 10: వ్యక్తి వికాసంతో పాటు సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర సాం ఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఐపిఎస్) అన్నారు.
పరకాల, డిసెంబర్ 10: వరుసగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెల వు రావటంతో రెండు రోజులు గడిచేదేలా అంటూ ప్రజలు అందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి 30 రోజులు గడిచిన ప్రజలు నగదు కోసం వ్యయ ప్రయాసలకు గురవుతూనే ఉన్నారు. అదివారం సెలవు, సోమవారం మిలాద్ల్నబి సందర్భంగా వరుసగా బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో బ్యాంకు ఉద్యోగులకు కొంత ఊరట కలిగించే విషయం.
రాయపర్తి, డిసెంబర్ 10 : భగవద్ఘీత పఠనం మనిషి జీవితానే్న మారుస్తూందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం మండలంలోని పెర్కవేడు శివసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్ధులకు గీతా శ్లోక పఠనంపై పోటీలు నిర్వహించారు.
వరంగల్, డిసెంబర్ 10: నగరం లో మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించే ఈవ్టీజర్లపై కఠినచర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాల్రావు హెచ్చరించారు.