S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 02:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రతిపక్షాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. గురువారం పార్లమెంటులోని తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ జరగకుండా రాజకీయ దురుద్దేశంతోనే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

12/02/2016 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిపేందుకు సిద్ధమంటూనే షరతులు విధించటం ఎంతవరకు సమంజసమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ప్రతిపక్షాన్ని నిలదీశారు. ఏదో ఒక నియమం కింద చర్చ జరిపే అధికారం మీకున్నది, మీకున్న అధికారం మేరకు వెంటనే చర్చ ప్రారంభించాలని అంటారు, చర్చ ప్రారంభిస్తే మాట్లాడకుండా పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తారు, ఏమిటిది?

12/02/2016 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కోర్టులు రాజకీయాలకు వేదికగా మారడం సమంజసం కాదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా, అనుసరించవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దీనివల్ల రాజకీయాలు కోర్టులకు మళ్లుతాయనే భయాలున్నాయి. మాకు ఇది ఇష్టం లేదు.

12/02/2016 - 02:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రముఖ ప్రొఫెషనల్ రెజిలర్ కాళీ గట్టిగా సమర్థించారు. గ్రేట్ కాళీగానే అందరికీ బాగా తెలిసిన దలీప్ సింగ్ రాణా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తుందని చెప్పారు.

12/02/2016 - 02:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాడివేడిగా ఉంటున్న రాజ్యసభ గురువారం కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. సభ వాయిదాపడిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ 15 నిముషాలసేపు సభలోనే ఉండి ఎంపీలతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కనిపించారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులను పలకరిస్తూ వారితో మాట్లాడుతూ గడిపారు.

12/02/2016 - 02:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురయిన మరుసటి రోజే ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)కు చెందిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులు దానిలో కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లు పోస్ట్ చేశారని కాంగ్రెస్ గురువారం పేర్కొంది.

12/02/2016 - 02:41

చెన్నై/ కడలూరు, డిసెంబర్ 1: నాడా తుపాను గురువారం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు కొంత ఊరట కలిగింది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

12/02/2016 - 02:40

చెన్నై, డిసెంబర్ 1: డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మందులు వికటించి ఎలర్జీ రావడంతో గురువారం ఉదయం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇదే సమస్యంతో గత నెల రోజుల నుంచి ఆయన బయటకురావడం లేదు. డ్రగ్ ఎలర్జీతో 93ఏళ్ల కరుణానిధిని కావేరీ ఆసుపత్రిలో చేర్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని వారు తెలిపారు.

12/02/2016 - 02:39

లండన్, డిసెంబర్ 1: అసలు మనం నివసిస్తున్న భూమి బరువెంతో తెలుసుకుంటే నిజంగా గుండె బరువెక్కిపోతుంది. కోటానుకోట్ల జంతు, వృక్ష జాతులు, లక్షలాది ఆకాశహర్మ్యాలు, భవనాలు, వంతెనలు, నిర్మాణాలు ఉన్న ఈ పుడమి బరువును అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం దాదాపుగా అంచనా వేయగలిగింది. దీని మొత్తం బరువు ఊహకైనా అందనంత రీతిలో 30 ట్రిలియన్ టన్నులపైనే ఉంటుందని లెక్కలు గట్టింది.

12/02/2016 - 02:39

వాషింగ్టన్, డిసెంబర్ 1: భారత్‌తో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ దేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కమిటీ తన నివేదికలో రక్షణ మంత్రికి, విదేశాంగ మంత్రికి సూచించింది.

Pages