S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 04:35

*చిత్రం... విజయవాడలో బోసిపోయిన ఓ మెగా షాపింగ్ మాల్

03/22/2020 - 04:34

విజయవాడ, మార్చి 21: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనికి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శనివారం ఇక్కడ డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు.

03/22/2020 - 04:31

చందర్లపాడు: కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కన్నతల్లే కర్కశంగా నీటితొట్టిలో వేసి వీరి ఉసురుతీసిందనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఆమె ఇంట్లో కనిపించకుండా పోవటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. పోలీసుల కథనం ప్రకారం..

03/22/2020 - 04:28

ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ, మార్చి 21: కర్నూలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గాలి, వడగండ్ల వాన కురవడంతో ఆళ్లగడ్డ మండలం పడకండ్ల, పి.నాగిరెడ్డిపల్లె, జంబులదినె్న, బాచ్చాపురం, రుద్రవరం గ్రామాల్లో చేతికొచ్చే వరి, మొక్కజొన్న, కొర్రలు, మునగ, అరటి తోటలు నేలకొరిగింది. ఉయ్యాలవాడ మండలం వర్షానికి వరి, మినుపు, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

03/22/2020 - 04:28

విజయవాడ, మార్చి 21: ఏపీలో కూడా కేరళ రాష్ట్రం తరహాలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని, ఈ ప్రమాదం మన ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యాపించడం దురదృష్టకరమన్నారు.

03/22/2020 - 04:27

విజయవాడ, మార్చి 21: జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మొవ్వా తిరుమల కృష్ణబాబు అవసరమైన చర్యలు తీసుకున్నారు. రోడ్డుపైకి ప్రజాలెవరూ బయటకు రాకుండా నిరోధించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 12వేల బస్సులను శనివారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ డిపోల్లో నిలిపివేశారు.

03/22/2020 - 04:26

విజయవాడ, మార్చి 21: దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన కరోనా రెండో దశలో ఉందని, ఇది మూడో దశలోకి ప్రవేశించకుండానే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలన్నీ తప్పక పాటిద్దామని రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. అందరం కలసికట్టుగా కరోనాపై విజయం సాధిద్దామని శనివారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.

03/22/2020 - 04:25

గుంటూరు, మార్చి 21: జాతీయ విపత్తులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమన్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/22/2020 - 04:25

గుంటూరు, మార్చి 21: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే రాష్ట్రాన్ని జగరోనా వణికిస్తోందని, కరోనా కంటే వైసీపీ నేతలు ప్రమాదకరంగా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ విమర్శించారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

03/22/2020 - 04:24

గుంటూరు, మార్చి 21: ఒకపక్క ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో పాటు రాష్ట్రంలో జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ఎన్నికల తంతు ప్రమాదకరంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages