S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, జూలై 20: ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిలను వదిలించుకోవడంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ.. బుధవారం అమెరికాకు చెందిన సంస్థ బ్రూక్ఫీల్డ్తో కలిసి 7,350 కోట్ల రూపాయల ఒత్తిడి ఆస్తుల నిధిని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్బిఐ నికర నిరర్థక ఆస్తులు 55,807 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే కొటక్ మహీంద్ర బ్యాంక్..
ముంబయి, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ ఔషధరంగ సంస్థలు సన్ ఫార్మా, గ్లెన్మార్క్, అరబిందో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొలెస్ట్రాల్ డ్రగ్ క్రెస్టర్కు చెందిన జనరిక్ వెర్షన్స్ అమ్మకాలను అమెరికా మార్కెట్లో చేసుకోవచ్చని ఆ దేశ హెల్త్ రెగ్యులేటర్ యుఎస్ఎఫ్డిఎ అనుమతినివ్వడం మదుపరులను ఉత్సాహపరిచింది.
కాకినాడ, జూలై 20: వంట నూనె మొదలుకొని వాహనాలకు వాడే ఇంధనం వరకు సర్వం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆయిల్ మాఫియా ఆడుకుంటోంది. ముఖ్యంగా నాణ్యతలేని వంటనూనెలతో ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతోంది. అటు కల్తీ పెట్రోల్, డీజిల్ కారణంగా వాహనాలకు, పర్యావరణానికీ ముప్పు తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరం కేంద్రంగా ఆయిల్ మాఫియా కొనే్నళ్లుగా చెలరేగిపోతోంది.
ఆంటిగ్వా, జూలై 20: కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా ఇక అసలు సిసలైన పోరాటాన్ని ఆరంభించనుంది. వెస్టిండీస్తో నాలుగు టెస్టుల సిరీస్కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ సిరీస్లో తొలి టెస్టు గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
న్యూఢిల్లీ, జూలై 20: వారణాసి ముద్దుబిడ్డగా ఖ్యాతి పొందిన భారత హాకీ లెజెండ్ మహమ్మద్ షాహిద్ ఇక లేరు. ఆటలో కొనసాగినంత కాలం అద్భుతమైన స్టిక్ వర్క్తో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచిన షాహిద్ గుర్గావ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు.
లాసానే, జూలై 20: డోపింగ్ కుంభకోణంలో పీకల్లోతున కూరుకుపోయిన రష్యా క్రీడాకారులను రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అనుమతించాలా? లేక వారిపై నిషేధం విధించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం ఇంకో వారం రోజుల సమయం పడుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) బుధవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 20: వెస్టిండీస్లో స్పిన్నర్లు ప్రముఖ పాత్ర పోషించే అవకాశముందని టెస్టు క్రికెట్కు దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటున్నాడు. వెస్టిండీస్లో వికెట్లు స్లోగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలా అయిన పక్షంలో స్పిన్నర్లు గొప్ప పాత్ర పోషించాల్సి ఉంటుంది’ అని బుధవారం ఇక్కడొక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ధోనీ మీడియాతో అన్నాడు.
ఆంటిగ్వా, జూలై 20: వెస్టిండీస్తో గురువారంనుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఆలోచనా ధోరణి (మైండ్సెట్) మారాల్సిన అవసరం ఉందని జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయ పడ్డాడు. టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్నుంచి టెస్ట్ఫార్మాట్కు ఆటగాళ్ల మైండ్సెట్ను మార్చడంపై దృష్టిపెట్టినట్లు కుంబ్లే చెప్పాడు.
లండన్, జూలై 20: పాకిస్తాన్తో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో పాటు లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్కు చోటు కల్పించారు.
వరంగల్, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలంతా భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్తో కలిసి బుధవారం వరంగల్ జిల్లా మేడారంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.