S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 01:48

సెంటినరికాలనీ, ఏఫ్రిల్30: తెలంగాణ రాష్ఠ్రంలో ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందనీ రాష్ట్ర డిప్యూటీ సి ఎం, ఉన్నతావిద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం సెంటినరికాలనీలో మంథని జె ఎన్టీయుహెచ్ కళాశాలలో సమ్రయ-2016 వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి యాజమాన్యం 50 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు.

05/01/2016 - 01:47

కరీంనగర్‌టౌన్, ఎప్రిల్ 30: ప్రజలకు తాగు నీరు సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళా కాంగ్రెస్ జిల్లా అద్యక్షురాలు చేర్ల పద్మ ఆద్వర్యంలో శనివారం నగర శివారులోని చింతకుంట రహదారిపై స్థానిక మహిళలతో రాస్తారోకో చేపట్టారు.

05/01/2016 - 01:47

జగిత్యాల రూరల్, ఏప్రిల్ 30:జగిత్యాల సింగిల్ విండో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ధాన్యాగారంగా మారింది. రబీ సీజన్ వరి ధాన్యంను మార్కెటుకు తరలించిన రైతుల ధాన్యంతో నిండిపోయింది. ఈఏడాది పలు గ్రామాల్లో ఐకేపి కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల దాదాపు35 గ్రామ పంచాయితీ రైతులకు ఈకేంద్రమే విక్రయ కేంద్రమైంది.

05/01/2016 - 01:46

కరీంనగర్, ఏప్రిల్ 30: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి రాత్రి 8గంటల వరకు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని, రాత్రి ఇక్కడే బస చేస్తారు.

05/01/2016 - 01:43

వరంగల్, ఏప్రిల్ 30: వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ, ఇంకుడు గుంతల కార్యక్రమం పోటాపోటీగా జరుగుతున్నాయి. చెరువుల పూడికతీతలో ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, మరో వైపు పోలీసులు సైతం పాల్గొంటున్నారు. అదే విధంగా ఇంకుడుగుంతల కార్యక్రమం కూడా ఊపందుకుంది. ఎయేడు ఎండలు ఎంత దంచికొడుతున్నాయో, అదే స్థాయలో వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు.

05/01/2016 - 01:43

ములుగుటౌన్, ఏప్రిల్ 30 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీటి కొరతను తీర్చేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. ములుగులోని ఆర్‌డిఒ కార్యాలయంలో శనివారం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లయితే అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.

05/01/2016 - 01:42

మంగపేట, ఏప్రిల్ 30: మే 20 నుండి 26 వరకు జరగనున్న శ్రీహేమాచల (మల్లూరు) లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబందించిన గోడ పత్రికను రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ శనివారం ములుగులో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు మల్లూరు రావాల్సిందిగా ఈ సందర్బంగా ఆలయ మేనేజర్ ఉడతనేని రామారావు మంత్రి చందులాల్‌ను ఆహ్వానించారు.

05/01/2016 - 01:41

వరంగల్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం నగరంలోని వడ్డెపల్లి పింగిళి డిగ్రీ కళాశాలలో ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే తరాలకు నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు.

05/01/2016 - 01:08

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30: పట్టణంలో శనివారం జరిగే వివిధ అభివృద్ది పనులలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

05/01/2016 - 01:08

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 30: మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశాన్ని సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు చైర్ పర్సన్ కావడానికి అప్పట్లో సహకరించిన బిజెపి, టిడిపి కౌన్సిలర్లు ప్రస్తుతం సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ ఆమర్ సమావేశం హల్ నుండి వెళ్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

Pages