S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జహీరాబాద్, ఏప్రిల్ 30: రోడ్డు దాడుతుంటే..వాహనంపై వెళ్తుంటే..ఇలా కాలినడకన వెళ్లినా వాహనంపై వెళ్లినా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రణాలు కోల్పోవడం పెరిగిపోతున్న ట్రాఫిక్ యుగంలో సర్వసాదారణమైంది. జరుగుతున్న ప్రమాదాలతో కుటుంబ పెద్దను కోల్పోయి వీధిపాలవుతున్న కుటుంబాల దుస్తితి వర్ణనాతీతంగా మారాయి.
జిన్నారం, ఏప్రిల్ 30: యావత్దేశంలో దమ్మున్న నెంబర్వన్ సిఎం కెసిఆర్ అని, తెలంగాణ మొత్తం తాగునీరిచ్చి ఓట్ల అడుగుతానన్న ఒకేఒక్కడని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మండల టిడిపి అధ్యక్షుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డితో పాలు పలువురు టీడీపీ, కాంగ్రెస్లకు చెందిన కార్యకర్తలు హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
పెద్దశంకరంపేట, ఏప్రిల్ 30: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి సల్పుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయా గ్రామాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 30: ఆసరా ఫించన్లకు లైఫ్ సర్ట్ఫికేట్ నిబంధన ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య హెచ్చరించారు. శనివారం స్థానిక కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫించన్లు ఎత్తివేసే కుట్రలో బాగంగానే ప్రభుత్వం లైఫ్ సర్ట్ఫికేట్స్ ఇవ్వాలనే నిబంధన పెడుతుందన్నారు.
బాన్సువాడ, ఏప్రిల్ 30: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలంలో గల బడాపహాడ్ దర్గా వద్ద ఇటీవల వెలుగు చూసిన హత్యోదంతాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు శనివారం వర్ని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు వర్నిలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 30: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ యోగితారాణా ఐసిడిఎస్, వైద్యారోగ్య శాఖల అధికారులకు సూచించారు. ఇదివరకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 15శాతానికే పరిమితం అవగా, ఏప్రిల్ నెలలో 45శాతానికి పెరిగాయని అధికారులను అభినందించారు.
వినాయక్నగర్, ఏప్రిల్ 30: బీడీ యాజమాన్యాలు నలభై రోజుల పాటు కంపెనీలను మూసివేసినందున బీడీ కార్మికులకు సంబంధిత రోజులకు వేతనాలు లెక్కించి పూర్తిస్థాయిలో చెల్లించాలని తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎఎస్.పోశెట్టి డిమాండ్ చేశారు.
మోర్తాడ్, ఏప్రిల్ 30: రైతులు విత్తన శుద్ధి చేయడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చని, ప్రధానంగా పంటలకు ఆశించే తెగుళ్ల బారి నుండి వాటిని కాపాడుకోవచ్చని రైతు శిక్షణ కేంద్రం డిడిఎ నర్సింహచారి అన్నారు. మోర్తాడ్ మండలం శెట్పల్లి, ధర్మోరా గ్రామాల్లో శనివారం జరిగిన మన తెలంగాణ - మన వ్యవసాయం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
కంఠేశ్వర్, ఏప్రిల్ 30: జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా కొనసాగుతున్న తొగర్ల సురేష్ రచించిన ‘మన కోసం..’ పుస్తకాన్ని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి ఆవిష్కరించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 30: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు జిల్లాలో మరింత వేగవంతం అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిని నియమించడంతో సొంత జిల్లాలో పనులను పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నారు.