S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 03:58

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు వెళ్తూ శ్రీ కాళహస్తిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు కోలా ఆనంద్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

04/16/2016 - 03:53

ఖాజీపేట, ఏప్రిల్ 15: మండలంలోని నాగసానిపల్లె చెరువు, కనె్నలవాగు చెరువుల్లో లభ్యమైన శవాలకు పోస్టుమార్టమే కీలకమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గురువారం కనె్నలవాగు జలాశయంలో గుర్తు తెలియని శవాన్ని కనుగొనడంతో ఏఎస్‌ఐలు శివశంకర్, సుబ్బారావు, స్పెషల్‌బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. శవం కుళ్లిపోయి ఉండటంతో ఆనవాళ్లను గుర్తు పట్టలేకపోయారు.

04/16/2016 - 03:53

సిద్దవటం,ఏప్రిల్ 15: మండల పరిధిలోని జంగాలపల్లె దళితవాడలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శనివారం నుంచి విగ్రహ ప్రతిష్టామహోత్సవాలు ప్రారంభమవుతాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. శనివారం, ఆదివారాల్లో రెండురోజులపాటు మహోత్సవాలు జరుగుతాయన్నారు.

04/16/2016 - 03:52

సంబేపల్లె, ఏప్రిల్ 15: మండల పరిధిలోని దేవపట్ల గ్రామం దాసరికాలనీకి చెందిన రామచంద్ర(46) వడదెబ్బతో శుక్రవారం మృతిచెందారు. బంధువుల సమాచారం మేరకు ఇతను పశుపోషణ చేస్తూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆవులను మేపుకుంటుండగా వడదెబ్బ తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

04/16/2016 - 03:51

కడప,ఏప్రిల్ 15: కడప నగర దాహార్తి తీర్చేందుకు నిధులు ఎంత ఖర్చు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుకాడటం లేదని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కడప నగర దాహార్తి తీర్చేందుకు కడప సమీపంలో నిర్మించిన నీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు.

04/16/2016 - 03:50

ఖాజీపేట, ఏప్రిల్ 15: మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన కొర్రు అంజనయ్య (40) వడదెబ్బతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని సుంకేసుల దళితవాడకు చెందిన అంజనయ్యకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. వృత్తి రిత్యా హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

04/16/2016 - 03:49

రాయచోటి/రామాపురం, ఏప్రిల్ 15: లక్కిరెడ్డిపల్లె మండలం దినె్నపాడు వడ్డెపల్లె సమీపంలో ఉన్న అడవిలో చిరుతపులి హల్‌చల్ చేసింది. రెడ్డయ్య అనే వ్యక్తిని గాయపరిచింది. వివరాలలోకి వెళ్లితే... లక్కిరెడ్డిపల్లె మండలంలోని దినె్నపాడు వడ్డెపల్లె సమీపంలో ఓబులరెడ్డికుంట వద్ద కొత్తవడ్డెపల్లెకు చెందిన నాగేష్ అనే వ్యక్తి గొర్రెలు మేపుతుండగా చిరుతపులి దాడికి దిగింది.

04/16/2016 - 03:48

కడప,ఏప్రిల్ 15: రాజంపేట పార్లమెంట్ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్ నేత జి.రామయ్య హఠాన్మరణం పార్టీకి, రాజంపేట ప్రజలకు తీరనిలోటని మహానేతగా ఎదిగిన ఆయన మరణించి దూరమైన ఆయన సేవలు మరువరానివని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రామయ్య హఠాన్మరణంతో శుక్రవారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

04/16/2016 - 03:47

కడప,ఏప్రిల్ 15: తెలుగుదేశంపార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా కేంద్రమాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటివరకు రాజంపేట ఇన్‌చార్జిగా కొనసాగుతున్న గునిపాటి రామయ్య రెండురోజుల క్రితమే హఠాన్మరణం చెందడంతో కాపు సామాజిక వర్గానికే చెందిన ఏ.సాయిప్రతాప్‌ను ఇన్‌చార్జిగా నియమించడానికి చర్చలు జరుగుతున్నాయి.

04/16/2016 - 03:47

కడప,ఏప్రిల్ 15: జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని , వర్గవిబేధాలు విడనాడి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు హితవుపలికారు. శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిల సమన్వయ సమావేశాన్ని మంత్రి గంటా కడపలో నిర్వహించారు.

Pages