S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2016 - 05:03

హైదరాబాద్, మార్చి 29: రాజధాని అమరావతి నిర్మాణం కోసం పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు ఏడు కోట్ల 77 లక్షల 10వేల రూపాయలను విరాళంగా అందజేశారు. మంగళవారం నాడు శాసనసభ సిఎం కార్యాలయంలో చంద్రబాబును పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు కలిసి ఈ విరాళాన్ని అందించారు.

03/30/2016 - 04:59

న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేసి సంచలనం సృష్టించింది. రాజకీయ సంక్షో భం కారణంగా ప్రస్తుతం రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఖర్చుల కోసం నిధులను సమకూర్చేలా ఆర్డినెన్సు జారీకి వీలుకల్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

03/30/2016 - 04:58

తిరుపతి, మార్చి 29: టిటిడి నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్టుకు దాతల నుంచి భూరి విరాళాలు భారీగా అందుతున్నాయి. ఈక్రమంలో 2015-16 సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.104.54 కోట్లు విరాళాలు అందాయి. ఈసందర్భంగా జెఇఒ శ్రీనివాసరాజు మాట్లాడుతూ టిటిడి అన్నదాన ట్రస్టుకు హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ మంగళవారం ఒక కోటి ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చారని అన్నారు.

03/30/2016 - 04:57

న్యూఢిల్లీ, మార్చి 29: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో జరిగిన పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ బృందం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం రాష్టప్రతిభవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయింది.

03/30/2016 - 04:56

హైదరాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో హర్‌ప్రీత్‌సింగ్‌ను నియమించారు. హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో అహ్మద్ నదీమ్ బాధ్యతలు చేపడతారు.

03/30/2016 - 04:55

హైదరాబాద్, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఐటి, మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. 2015-16 బడ్జెట్‌లో ముస్లిం మైనార్టీల కోసం రూ.376 కోట్లు కేటాయిస్తే రూ.362 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మంగళవారం శాసనసభలో మైనార్టీల సంక్షేమ పద్దుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన అంశాలకు మంత్రి పల్లె వివరణ ఇచ్చారు.

03/30/2016 - 04:54

హైదరాబాద్, మార్చి 29: వివిధ ప్రభుత్వ శాఖల కింద 2016-17 సంవత్సరానికి గాను గ్రాంట్ల కోసం అభ్యర్థిస్తూ మంత్రులు చేసిన ప్రతిపాదనలకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపాదించిన మేరకు 2016-17 సంవత్సరానికి ఆయా శాఖలకు అవసరమైన మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో వెల్లడించారు. అనంతరం సభ ఆమోదానికి తెలియజేయడంతో అంతా ఆమోదించారు.

03/30/2016 - 04:50

హైదరాబాద్, మార్చి 29: తమ పార్టీ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురి చేసి టిడిపిలో చేర్చుకుంటున్నారని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. నాయకుడంటే విశ్వసనీయత, నిబద్ధత ఉండాలన్నారు. ఈ రెండూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేవన్నారు.

03/30/2016 - 04:50

హైదరాబాద్, మార్చి 29:పోలవరం, పట్టిసీమపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ముఖ్యమంత్రి చంద్రబాబు,విపక్ష నేత జగన్‌ల మధ్య వాడివేడి వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది వాటిలో మచ్చు కు కొన్ని..
జగన్: కెసిఆర్-మహారాష్ట్ర సిఎంతో నీటిపై ఒప్పందాలు కుదుర్చుకుంటే అడ్డుకోవడానికి భయపడ్డావు. కెసిఆర్ అంటే నీకు భయం. ఓటుకు నోటు కేసుతో నీవు భయపడుతున్నావు.

03/30/2016 - 04:46

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధించాలనే ధ్యేయంతో నిర్వహణ యాజమాన్య బట్వాడా యూనిట్ (పెమండు)ను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Pages