S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/30/2020 - 05:41

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ గ్రామీణ బ్యాంకులో సీబీఐ బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఈ బ్యాంకు కుప్వారా శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి 1.33 కోట్ల రూపాయల మేర నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్‌తోపాటు ఇక్కడ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షారీఫ్ హుసేన్ ఖాన్ నివాసంలోనూ సీబీఐ సోదాలు జరిపింది.

01/29/2020 - 02:10

సనత్‌నగర్, జనవరి 27: ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతిచెందిన సంఘటన సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన సాయి దీపీక రెడ్డి(24) జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలో విధులు నిర్వహిస్తుంది.

01/29/2020 - 02:41

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో సీబీఐ-ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది.

01/29/2020 - 02:39

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిహార్‌లోని ముజాఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. షెల్టర్ హోమ్‌లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో బ్రజేష్ ఠాకూర్ సహా 18 మందిని ఢిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది. బ్రజేష్ ఠాకూర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అతడితోపాటు 18 మందిని జనవరి 20న కోర్టు దోషులుగా తేల్చింది.

01/29/2020 - 02:40

న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో దోషి ముకేష్‌కుమార్ సింగ్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించాలని చేసిన విజ్ఞప్తిమేరకు సుప్రీంకోర్టు మంగళవారం విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచింది. బుధవారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

01/28/2020 - 06:22

నల్లగొండ లీగల్, జనవరి 27: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల హత్యాచారం కేసు తీర్పును నల్లగొండ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. జడ్జి ఎస్.వీ.వీ. నాథ్‌రెడ్డి సోమవారం కేసు విచారణ సందర్భంగా తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో తుది తీర్పును ఫిబ్రవరి 6కు వాయిదా వేశారు.

01/28/2020 - 06:20

ఆదిలాబాద్, జనవరి 27: ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ అటవీ ప్రాంతంలో సమతపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో తుది తీర్పును ప్రత్యేక కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. నవంబర్ 24న ఒంటరిగా వెళ్తున్న సమతపై ముగ్గురు నిందితులు పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపిన విషయం వ్దిఒతమే.

01/28/2020 - 02:21

విజయవాడ (క్రైం), జనవరి 27: రాత్రివేళల్లో షట్టర్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన కేసుల్లో నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారు. నిందితుల నుంచి మూడు కేసుల్లో సుమారు రూ.7లక్షల 30వేలు విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్, షైల్ సింగ్, రమేష్ రాబరి, కన్నయ్ లాల్ పాత నేరస్తులే.

01/28/2020 - 02:21

పామర్రు, జనవరి 27: ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత దారి దోపిడీకి గురై రూ.11లక్షలు విలువ చేసే రొయ్యల కేసులో రెండు రోజుల్లో ముద్దాయిలను గుర్తించి పట్టుకుని సోమవారం అరెస్టు చేసినట్లు గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు.

01/28/2020 - 01:26

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిపై హైకోర్టు ఆరా తీసింది. డిజైన్లు ఖరారు చేశారా? సచివాలయ నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించారా? అని ప్రశ్నించింది. అన్ని వివరాలనూ హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

Pages