-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వలిగొండ, ఫిబ్రవరి 3: గ్రామస్థులు, ఇతరులు ఊహించనట్లుగానే లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు చాట్ల పాండు హత్య ఇసుక మాఫియా పనేనని తేలింది. సోమవారం డీసీసీ నారాయణరెడ్డి నేరస్తులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను తెలియజేశారు.
న్యూఢిల్లీ: శబరిమలతోపాటు వివిధ ప్రార్థనామందిరాల్లోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది. విచారణ అంశాల క్రోడీకరణకు తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి ఏస్ఏ బాబ్డే గురువారానికి వాయిదా వేశారు.
నాగ్పూర్: మహారాష్టలోని వార్ధా జిల్లాలో ఓ ఘోరం చోటుచేసుకుంది. 25 ఏళ్ల అధ్యాపకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నలభై శాతం కాలిన గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. అనిత పిసుడ్డే(25)పై సోమవారం ఉదయం 7.15 గంటలకు పెట్రోల్ దాడి జరిగింది.
న్యూఢిల్లీ: నాలుగు వారాల్లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని సుప్రీం కోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేలా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని హైకోర్టులను కోరింది. న్యాయాన్ని ప్రజల ముంగిళ్లకు తీసుకెళ్లే లక్ష్యంతో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించిన చట్టాన్ని 2008లో పార్లమెంటు ఆమోదించింది.
ముంబయి: మహారాష్టలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని జలగాం జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకొంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నోళ్లు తెరుచుకొన్న, నిర్లక్ష్యంగా వదిలివేసిన బోర్లలో పడి చిన్నారులు చనిపోతున్న ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 2010 సంవత్సరంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఎటువంటి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోకపోవడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారనీ..
జమ్మూ/శ్రీనగర్: పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించిన పుల్వామా దాడి నిందితుడు, జైష్-ఏ-మహ్మద్ తీవ్రవాది సమీర్ దార్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. పుల్వామాలో మానవ బాంబు అమర్చుకుని ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్ దార్కు సమీర్ దార్ సోదరుడు.
న్యూఢిల్లీ: నిర్భయ హంతకుల మరణ శిక్షపై స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సంబంధిత పార్టీల వాదోపవాదాలు ముగిసిన తర్వా త న్యాయమూర్తి సురేష్ ఖాయర్ దీని పై తన ఉత్తర్వులు జారీ చేస్తారు.
అనంతపురం, ఫిబ్రవరి 1: నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. సర్ట్ఫికెట్లు ముద్రించి విక్రయించే గ్లెన్బ్రిగ్స్తో పాటు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ, కర్నాటక పోలీసులకు మోస్ట్వాంటెడ్గా ఉన్న గ్లెన్బ్రిగ్స్ కేజీ నుంచి పీజీ వరకు, గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్ట్ఫికెట్ అయినా ఇట్టే నకిలీది సృష్టించడంలో దిట్ట.
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 1: రాత్రి వేళల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్థుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.30లక్షలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ హర్షవర్థన్రాజు వివరాలు వెల్లడించారు.