S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/24/2020 - 05:39

న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి ఓ మహిళ తన ఏడుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన ఉదంతంలో సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష అంశంలో రివ్యూ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, వారి భార్యలు, పదేళ్ల చిన్నారిని హతమార్చిన వైనంలో సుప్రీం కోర్టు ఇద్దరికీ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

01/24/2020 - 05:33

పాయకాపురం, జనవరి 23: ఒక మహిళా డాక్టర్‌పై వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై హైకోర్టు న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగర శివారు ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు స మాచారం.

01/24/2020 - 05:33

విజయవాడ పశ్చిమ, జనవరి 23: చిరుప్రాయంలోనే చెడు అలవాట్లు, చెడు స్నేహాల ప్రభావంతో మోటారు బైక్‌ల చోరీలకు అలవాటు పడిన 17ఏళ్ల బాలుడు సహా నలుగురు నిందితులను భవానీపురం క్రైం ఎస్‌ఐ వండ్రంగి కృష్ణబాబు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి నుండి 8 మోటారు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల భవానీపురం ప్రాంతంలో పలు మోటారు బైకులు మాయమైయ్యాయి.

01/24/2020 - 05:32

తోట్లవల్లూరు, జనవరి 23: తోట్లవల్లూరు సమీపంలోని కరకట్ట మీద బు ధవారం రాత్రి 10 గంటల సమయం లో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టటంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరసా రవికాంత్, పరసా విజయలక్ష్మి ఇద్దరు ప్రైవేటు సెక్యూరీటీగార్డులుగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉద్యోగం చేస్తున్నారు.

01/24/2020 - 05:31

గన్నవరం, జనవరి 23: పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి చోరీ చేసిన కేసులో నిందితుడ్ని గన్నవరం పోలీసులు అరెస్టు చేసి అతని నుండి 18.86 లక్షల రూపాయల విలువ నగదు, బంగారు ఆభరణాలతో సహా 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కె శ్రీనివాసరావు తెలిపారు.

01/24/2020 - 02:08

గద్వాల, జనవరి 23: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దయ్యాలవాగు సమీపంలో గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గద్వాల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/24/2020 - 01:57

అమీన్‌పూర్, జనవరి 23: ఇంటినుండి బయటకు వెళ్లిన ఒక బాలికపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

01/24/2020 - 01:56

పాడేరు, జనవరి 23: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రాంప్రసాద్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక లోచలిపుట్టులోని రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఐటీడీఏ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అధికార, ఉద్యోగ వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేసింది.

01/24/2020 - 02:05

గుంటూరు (లీగల్): రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డిఏ రద్దు చేయడంపై దాఖలైన కేసుల విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్వంత్‌కుమార్ మహేశ్వరి గురువారం ఆదేశించారు. ఈ అంశాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై పిటిషనర్ల తరపు న్యాయవాది అశోక్‌భన్ కోర్టుకు వివరించారు.

01/23/2020 - 22:47

తిరుపతి, జనవరి 22: దర్శనం, వసతి కల్పిస్తానంటూ హైదరాబాద్‌కు చెందిన భక్తుడి నుంచి రూ. 40వేలు ప్యాకేజీ మాట్లాడుకుని భక్తుడితో ఏర్పడిన విభేదాలతో టీటీడీ అటెండర్ దామోదర్ రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికాడు. టూ టౌన్ సి ఐ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ నరసింగరావు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో దామోదర్ రెడ్డిని సంప్రదించాడు.

Pages