-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వికారాబాద్, డిసెంబర్ 12: ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సింలు(55) రెండు రోజుల క్రితం ఎనె్నపల్లి నుండి మద్గుల్ చిట్టంపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఉన్న నీటికుంటలో స్నానానికి దిగాడు. ఈత రాకపోవడంతో అందులో చిక్కుకుని మృతి చెందాడు.
వడమాలపేట, డిసెంబర్ 12: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న రూ. 80 లక్షల విలువ గల 30 ఎర్ర చందనం దుంగలను టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు మినీ లారీలో తరలిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం తెల్లవారుజామున కరకంబాడి వద్ద కాపుకాశారు.
న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్నకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా కె.ఈరన్న (తెలుగుదేశం) అనర్హుడు అంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.
వెదురుకుప్పం, డిసెంబర్ 12: మండలంలోని రాజబావి కోన వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పెనుమూరు మండలం బొంతివంక గ్రామానికి చెందిన బి.లోకనాథ నాయుడు (60), బి.సుబ్రహ్మణ్యం నాయుడు (61) తిరుపతి నుంచి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తమిళనాడు నుంచి వస్తున్న టీఎన్ 01 ఏవీ 4266 నెంబరుగల కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
పుత్తూరు, డిసెంబర్ 12: రోడ్డు దాటుతుండగా మినీ వ్యాన్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పుత్తూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి, డిసెంబర్ 12: శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారిలోని మిట్టకండ్రిగ వద్ద బుధవారం కారు, లారీ ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ సహా ముగ్గురు గాయాలపాలయ్యారు.
మార్కాపురం, డిసెంబర్ 12: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా చెక్ వ్రాసి ఇచ్చి బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో బౌన్స్ కావడం వలన ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, 5వేల రూపాయలు జరిమానా విధిస్తూ బుధవారం న్యాయమూర్తి షియాజ్ఖాన్ తీర్పు చెప్పారు. పట్టణానికి చెందిన యక్కలి వెంకటరమణ పట్టణానికి చెందిన గుర్రం రామారావు వద్ద డబ్బులు తీసుకొని చెక్ వ్రాసి ఇవ్వడం జరిగింది.
రావులపాలెం, డిసెంబర్ 12: టీవీలో వస్తున్న క్రికెట్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాలను చూస్తూ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఒక ముఠాను మంగళవారం అర్ధరాత్రి రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఐ బి పెద్దిరాజు వివరాలు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిని స్వాధీనం చేసుకున్న నగదు, టీవీ, సెల్ఫోన్లతో సహా హాజరుపరిచారు.
న్యూఢిల్లీ: అత్యాచార బాధితులను సమాజం అంటరానివారిగా చూడడం పట్ల సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అత్యంత దురదృష్టరమని కోర్టు వ్యాఖ్యానించింది.‘లైంగిక దాడులకు, అత్యాచారానికి గురైన బాధితుల పేర్లు గోప్యంగా ఉంచాలి’అని న్యాయమూర్తి మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జాగ్రత్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బెంచ్ స్పష్టం చేసింది.
రావికమతం, డిసెంబర్ 11: మండలంలో గర్నికం గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున స్కార్పియో వాహనం భీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తు ఈ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదు. వాహనంలో ఉన్న ప్రయాణీకులు సైతం సురక్షితంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.