S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ విజయంతో విభిన్నమైన కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్ని విభిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో చిత్రానికి కమిట్ అయినట్టు తెలిసింది. తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయం సాధించిన ‘నేరం’ సినిమా రీమేక్లో నటించనున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా నేటివిటీతో వుండే ఈ సినిమాతో మరో ప్రయత్నం చేయనున్నాడు సందీప్.
టాలీవుడ్లో యువనటుడు అల్లు అర్జున్కు వున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో క్రేజీ రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఫేస్బుక్లో అల్లును లైక్చేసిన వారి సంఖ్య కోటిదాటింది. ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం లేకుండా స్టార్ సెలబ్రిటీలు వుండడం లేదు. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు కూడా.
‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు దర్శకుడు మారుతి. చిన్న చిత్రాల దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మారుతి, ఈ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం వెంకటేష్తో ‘బాబు బంగారం’ చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతికి మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే రామ్చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు గ్రీన్సిగ్నల్ వచ్చింది.
సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్యా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.కృష్ణవంశి రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ను పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ, తొలి షెడ్యూల్ను అరకు, ఒడిసాలో చిత్రించారని, రెండో షెడ్యూల్ను వికారాబాద్ ఫారెస్ట్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించామని తెలిపారు.
సునీల్ కథానాయకుడిగా వాసూ వర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తున్నాయని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగిన విధంగా రూపొందించామని తెలిపారు.
గ్లామర్ హీరోయిన్గా దక్షిణాదిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐటెం సాంగ్స్ కోసం భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న ఈ భామ తాజాగా మరో యువ హీరోతో జోడీ కట్టనుంది. ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించనుంది.
ప్రముఖ నటుడు పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం షూటింగ్ 25 రోజులపాటు హైదరాబాద్లో జరుపుకునే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వేసిన మార్కెట్ సెట్లో షూటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం కేరళలో ఐదు రోజులపాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈనెల 5 నుండి కేరళలో ఐదు రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొననుంది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం ‘బాహుబలి’.
రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాహుబలికి సీక్వెల్గా ‘బాహుబలి-2’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ‘బాహుబలి’ సరికొత్తరూపంలో ఇంటిల్లిపాదినీ అలరించేందుకు
‘అతనొక్కడే’, ‘పటాస్’ చిత్రాలతో ప్రామిసింగ్ కథానాయకుడిగా నిరూపించుకున్న నందమూరి కల్యాణ్రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నె.8గా రూపొందనున్న ఈ భారీ చిత్రాన్ని కల్యాణ్రామ్ నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికై అంచనాలు నెలకొన్నాయి.
‘గమ్యం‘, ‘వేదం’, ‘కంచె’ వంటి సినిమాలతో విభిన్నమైన దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. మెగా హీరో వరుణ్తేజ్తో రూపొందించిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది.