-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కృష్ణానదీ జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేసేందుకు ఏర్పాటుచేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబునల్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారాం ఆంధ్రా తరపు సాక్షిగా ఉన్న సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరపు న్యాయవాది వైద్యానాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దించే దిశగా వ్యూహాత్మకంగా సాగుతున్న సీపీఎంకు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీతోను, ఇతర లౌకిక పార్టీలతోను రాజకీయ అవగాహనను కుదర్చుకునే విషయంలో సీపీఎం పొలిట్బ్యూరోలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. రెండురోజులపాటు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో రెండు అంశాలను ప్రధానంగా చర్చించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పవిత్ర యమునా నదీ తీరానికి విఘాతం కలిగేలా సాంస్కృతిక కార్యమ్రాలకు ఎలా అనుమతులిస్తారు. మీకు బాధ్యత లేదా? అంటూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డిపిసిసి)పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు అనుసరిస్తున్న విధానం చట్టపరిధిలో లేదు’ అంటూ ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కొత్తగా పెళ్లిచేసుకున్న జంటలను ఆశీర్వదించి ఏదో ఒక బహుమతి ఇవ్వడం ఆనవాయతీ. అయతే అలహాబాద్లో ఆదివారం జరిగిన సామూహిక వివాహాల్లో కొత్త దంపతులకు ఇలా టాయ్లెట్లను బహూకరించారు.
‘ఇంటింటికీ మరుగుదొడ్డి’ పథకం కింద స్వచ్ఛ భారత్ మిషన్ ఇలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశవ్యాప్తంగా మద్యనిషేధాన్ని అమలుచేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నితీశ్ పార్టీ కార్యకర్తలను కోరారు.
ముంబయి, డిసెంబర్ 10: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ 95వ పడిలోకి అడుగుపెడుతున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీని దృష్ట్యా జన్మదిన వేడుకలను పెద్దఎత్తున జరపడం లేదని, ఆయనకు బాగా ఇష్టమైన బిర్యానీ, ఐస్క్రీమ్ను మాత్రమే సిద్ధం చేస్తున్నట్లు ఆయన సతీమణి, నటి సైరాబాను ఆదివారం వెల్లడించారు. ‘ఆయనకు బిర్యానీ, ఐస్క్రీమ్ చాలాఇష్టం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రస్తుతం ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో మీడియా కౌన్సిల్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం చట్టం తీసుకురావాలని నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్ఏజే) డిమాండ్ చేసింది. ఇటీవలికాలంలో పత్రికా రంగం, పత్రిగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్ఏజే నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాల నాయకులు ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సదస్సు నిర్వహించారు.
గోద్రా (గుజరాత్), డిసెంబర్ 10: పదిహేను సంవత్సరాల క్రితం హింసాకాండతో అట్టుడికిన గోద్రా ప్రాంతా ప్రజలు ఇప్పుడు శాంతిని, ఉపాధిని, ఆశావహమైన భవితను కోరుకుంటున్నారు. గతానికి స్వస్తి పలికి భవిష్యత్పైనే ఆశలు పెంచుకుని ఉపాధి, ఉద్యోగాలే ధ్యేయంగా సాగాలనుకుంటున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రఖ్యాత శాస్తవ్రేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ లాల్జీసింగ్ ఆదివారం రాత్రి వారణాసిలో కన్నుమూశారు. డిఎన్ఎ ప్రింటింగ్కు పితగా ఆయనను భావిస్తారు. సిసీఎంబీ డైరెక్టర్గా, బెనారస్ హిందూ యూనివర్శిటీ వైస్ చాన్సలర్గా కూడా పనిచేసిన లాల్జీసింగ్ ఆదివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతోవెంటనే ఆయనను అక్కడే ఉన్న సందర్లాల్ ఆస్పత్రికి తరలించారు.
ముంబయి, డిసెంబర్ 10: అమీర్ఖాన్ బ్లాక్బస్టర్ సినిమా ‘దంగల్’లో నటించిన జైరా వాసిమ్కు చేదు అనుభవం ఎదురైంది. కాశ్మీర్కు చెందిన ఈ టీనేజ్ నటి ఢిల్లీ నుంచి ముంబయికి విమానంలో వస్తుండగా తనకు జరిగిన లైంగిక వేధింపులను ఇంస్టాగ్రామ్లో నేరుగా తెలియజేసింది.