S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2017 - 03:47

చెన్నై, నవంబర్ 16: తమిళనాడు రాజకీయాలపై ఇటీవల ఆసక్తి కనబరచిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తాను అభిమానుల నుంచి సేకరించిన విరాళాలను వెనక్కి ఇస్తున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో ఆయన ప్రస్తుతానికి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు లేనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఓ తమిళ వారపత్రికలో తాను రాస్తున్న ‘కాలమ్’లో కమల్ తన మనోగతాన్ని వెల్లడించారు.

11/17/2017 - 03:45

చిత్రాలు.. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యమయం కావడాన్ని నిరసిస్తూ గురువారం ముక్కులకు మాస్కులు తగిలించుకోవడంతోపాటు మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా మాస్కులు తగిలించి నిరసన తెలుపుతున్న ఆమ్ ఆద్మీ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ ఎమ్మెల్యే మన్‌జీందర్ సింగ్ సిర్సా.
*వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లపై నీళ్లు జల్లుతున్న అగ్నిమాపక దళ సిబ్బంది

11/17/2017 - 03:39

అయోధ్య, నవంబర్ 16: అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని ముస్లింలలో అత్యధిక సంఖ్యాకులు వ్యతిరేకించడం లేదని ప్రముఖ ఆథ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. మందిరం నిర్మిస్తే ‘కొంతమంది’కి మాత్రం ఇష్టం ఉండదని తనకు తెలుసునని, దాదాపు ముస్లింలంతా ఇందుకు సానుకూలమేనని ఆయ న తెలిపారు.

11/17/2017 - 03:36

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ పేర్కొన్నారు. భారత్ దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరూ అడ్డుకోజాలరని ఆయన అన్నారు.

11/17/2017 - 03:34

న్యూఢిల్లీ, నవంబర్ 16: కృష్ణానదీ జలాల పంపకాలపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏపీ తరపు సాక్షిగా ఉన్న కెవి సుబ్బారావును తెలంగాణ తరపు న్యాయవాది వి.రవిందర్‌రావు వరుసగా రెండోరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డెల్టాలో వర్షంవల్ల ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఆ ప్రాంతంలో కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు వివరించారు.

11/17/2017 - 03:34

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో పడవ ప్రమాదాలు జరగకుండా ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌తనమ్ గురువారం లేఖలు రాశారు.

11/17/2017 - 03:33

గురువారం ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ను ప్రారంభించి ఢిల్లీ హట్‌లోని కళాకారులతో ముచ్చటిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు

11/17/2017 - 02:53

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ అవార్డును దక్కించుకుంది. ఇండియా టుడే సంస్థ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సర్వే-2017లో వివిధ రాష్ట్రాలకు గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలలో అవార్డులను ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రెండు పురస్కారాలు దక్కాయి.

11/17/2017 - 02:28

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కీలక తీర్పు వెలువడనుంది. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రంనుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని, రాజధాని ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నాలుగు పిటిషన్లు ఎన్జీటీలో దాఖలయ్యాయి.

11/17/2017 - 02:27

న్యూఢిల్లీ, నవంబర్ 16: జీఎస్‌టీ రేట్లను తగ్గించిన తరువాత కూడా ప్రజలకు ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయించి అతిలాభం సంపాంచేందుకు ప్రయత్నించే వ్యాపారస్థుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ (ఎన్‌ఏఏ)ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Pages