-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, నవంబర్ 15: భారత్లో త్వరలో జరిగే కుంభమేళాపైన, కేరళలో నిర్వహించే ‘త్రిసూర్ పూరమ్’ వేడుకలపైన దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ హెచ్చరించింది. అమెరికాలోని లాస్వేగాస్ నగరంపై దాడి చేసిన రీతిలోనే కుంభమేళా, త్రిసూర్ పూరమ్పై తమ ప్రతాపం చూపుతామని మళయాల భాషలో పది నిమిషాల నిడివి ఉన్న ఆడియో టేపును ‘ఐసిస్’ విడుదల చేసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయ.
న్యూఢిల్లీ, నవంబర్ 15: గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సెక్స్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్, ఆయన అనుచరులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్పింగ్లపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది. హార్దిక్ పటేల్ మహిళలు, మందు సీసాలు ఉన్న మొత్తం ఐదు సెక్స్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
అహమ్మదాబాద్, నవంబర్ 15: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీపై మళ్లీ మాటల దాడి చేశారు. 14వ శతాబ్దానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్లను రద్దు చేశాడని గుర్తుచేస్తూ, మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి ఒరిగిందేమీలేదన్నారు.
లక్నో, నవంబర్ 15: అయోధ్య సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానంటూ మధ్యవర్తిత్వానికి సిద్ధమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ముస్లిం వర్గాలనుంచి తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘సమస్య పరిష్కారానికి ఆయన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో ముందు చెప్పమనండి’ అంటూ ముస్లిం వర్గాలు డిమాండ్ చేశాయి.
తిరువనంతపురం, నవంబర్ 15: భూకబ్జా ఆరోపణలు నేపథ్యంలో కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాందీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అలప్పుఝా జిల్లాలో భూకబ్జాలో మంత్రికి సంబంధించిన కంపెనీ ప్రమేయం ఉందని కలెక్టర్ నివేదించారు. దీన్ని మంత్రి చాందీ హైకోర్టులో సవాల్ చేసి భంగపడ్డారు. ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రవాణా మంత్రి తన పదవికి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 15: పొద్దస్తమానం టీవీల ముందు కూర్చుని కామిక్స్ చూడకపోతే ఏం.. కాస్త పుస్తకం తీసి లెక్కలు ప్రాక్టీస్ చేయొచ్చుగా అంటూ అమ్మ పెట్టే చివాట్లు చాలా ఇళ్లలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే, అలాంటి పిల్లలకే లెక్కలు బాగా వంటపడతాయన్న అధ్యయనాలను ఆ తల్లులకు వినిపిస్తే ఏమంటారో చూడాలి?
న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారణకు దండిగా నిధులున్నా కార్యాచరణ మాత్రం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. వాయు కాలుష్యంపై పోరాడేందుకు ఢిల్లీలో అధికార యంత్రాంగం ‘హరిత నిధి’ పేరిట సుమారు 1,500 కోట్ల రూపాయలను సమీకరించింది. నిధులను చాలావరకూ ఖర్చు చేయకపోవడంతో ఢిల్లీ వాసులు విషతుల్యమైన కాలుష్యంతో విలవిలలాడుతున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 128వ జయంత్యుత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నెహ్రూ ఘనతను గుర్తు చేసుకుంటూ రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అల్పించారు. పండిన్ నెహ్రూ దేశానికి గొప్ప నాయకుడు అంటూ రాష్టప్రతి రామ్నాథ్ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14: ఆంధ్ర, తెలంగాణ సివిల్ న్యాయమూర్తులు, న్యాయాధికారుల విభజనకు సంబంధించిన కేసుపై విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ నిరాకరించారు. చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించటం తెలిసిందే. నాలుగు వారాల నుండి విచారణ కొనసాగిస్తున్న చలమేశ్వర్ మంగళవారం అకస్మాత్తుగా ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14: శత్రుప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి నిర్దేశిత లక్ష్యాలను చేధించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా భారత్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఇందులో భాగంగానే అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యం కలిగిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని సుఖోయ్ ఎస్యు- 30 యుద్ధ విమానం ద్వారా పరీక్షించేందుకు సన్నద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల కథనం.