S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/08/2017 - 01:55

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె)పై తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ప్రసిద్ధ రచయితల వ్యాసాల సంకలనం గ్రంథాన్ని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడికి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందజేశారు. గురువారం వెంకయ్య నాయుడిని యార్లగడ్డ కలిశారు. ఈ గ్రంధంలోని మొదటి వ్యాసం వెంకయ్యనాయుడిదే కావడం విశేషం.

09/08/2017 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న సట్లేజ్- యమున లింక్ (ఎస్‌వైఎల్) కాలువపై న్యాయమైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రానికి సుప్రీం కోర్టు ఆరువారాల సమయం ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీం బెంచ్‌ని అభ్యర్థించారు.

09/08/2017 - 01:09

ముంబయి, సెప్టెంబర్ 7:ముంబయి గొలుసు పేలుళ్ల కేసులో ప్రత్యేక టాడా కోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్‌లకు మరణ శిక్ష విధించిన కోర్టు గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు యావజ్జీవ ఖైదును విధించింది. నేరస్తుల అప్పగింత చట్టంలోని నిబంధన కారణంగానే అబూ సలేం మరణ శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. సలేంతో పాటు కరిముల్లా ఖాన్‌కు కూడా యావజ్జీవం పడింది.

09/07/2017 - 02:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: గో రక్షణ పేరిట సాగుతోన్న హత్యాకాండపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రక్షణ బృందాలు చేస్తున్న హత్యలను అరికట్టాల్సిందేనంటూ రాష్ట్రాలను ఆదేశించింది. వారంలో అన్ని జిల్లాల్లో సీనియర్ పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని రాష్ట్రాలకు తెగేసి చెప్పింది.

09/07/2017 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ దారుణ హత్యను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. గౌరీ లంకేష్ హత్యపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సోనియా గాంధీ హేతువాదుల వరుస హత్యలకు ఎవరు బాధ్యులని నిలదీశారు. గౌరీ లంకేష్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవారని, ప్రతికూల వ్యవస్థను ఆమె ధైర్యంతో ఎదుర్కొనేవారని సోనియా గాంధీ చెప్పారు.

09/07/2017 - 02:24

కోయంబత్తూరు, సెప్టెంబర్ 6: తమిళనాడు అసెంబ్లీలో అన్నా డిఎంకె ఎమ్మెల్యేలందరి పూర్తి మద్దతు తనకుందని ముఖ్యమంత్రి పళనిస్వామి బుధవారం స్పష్టం చేశారు. మరోపక్క శశికళ వర్గానికి చెందిన టిటివి దినకరన్‌కు విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఇంకా పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో పళనిస్వామి చేసిన ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది.

09/07/2017 - 02:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో రోజువారీగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 400 మంది మరణిస్తున్నారని, వీరిలో 46 శాతం మంది 18 నుంచి 35 సంవత్సరాలలోపు వారేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

09/07/2017 - 02:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో రెవిన్యూ కీలకపాత్ర పోషిస్తుందన్న ఆయన ఖాతాదారుల పట్ల మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చాణక్య నీతిని ఆయన ప్రస్తావించారు.

09/07/2017 - 02:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రాజకీయ నాయకుల ఆస్తులు అనంతంగా పెరిగిపోతున్నావారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది వివరించకపోవడం పట్ల సుప్రీం కోర్టు బుధవారం కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండు ఎన్నికల్లోకొంత మంది రాజకీయ నాయకులు ఆస్తులు ఏకంగా 500 శాతం పెరిగిపోయిన అంశాన్ని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి తగిన సమాచారాన్ని తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

09/07/2017 - 02:23

లక్నో, సెప్టెంబర్ 6: లక్నోలో ప్రారంభమైన మెట్రో రైళ్ల సర్వీసు తొలిరోజునే తీవ్రస్థాయిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు గంటకుపైగా వంద మంది ప్రయాణికులు ఈ లక్నో మెట్రో రైల్లో చిక్కుకుపోయారు. బుధవారం ఉదయం 7.15 గంటలకు చార్బాగ్ నుంచి ట్రాన్స్‌పోర్టు నగర్ మెట్రో స్టేషన్‌కు ఈ రైలు బయలుదేరింది. దారిలోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ బ్రేకు వేశారు.

Pages