S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/05/2017 - 03:07

పదోన్నతి పొందిన, శాఖలు మారిన కేంద్ర మంత్రులు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పీయూష్ గోయల్‌ను అభినందిస్తున్న సురేష్ ప్రభు.

09/05/2017 - 02:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఎన్‌డిఏ ప్రభుత్వం డోక్లామ్ సమస్యను ఎదుర్కోవడంలో గట్టిగా వ్యవహరించినందుకే పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా విషయంలో చైనా దిగివచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జెఇఎం, ఎల్‌ఇటిల గురించి బ్రిక్స్ తీర్మానంలో ప్రస్తావించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

09/05/2017 - 02:21

ఫరూఖాబాద్ (యుపి), సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లో మరో ‘గోరఖ్‌పూర్ దారుణం’ బయటపడింది. ఫరూఖాబాద్ జిల్లా ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో 49మంది నవజాత శిశువులు మరణించారు. వీరిలో 30మంది నియోనాటల్ ఐసియులో చనిపోగా 19మంది డెలివరీ సమయంలో చనిపోయారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

09/05/2017 - 02:19

చెన్నై, సెప్టెంబర్ 4: అన్నాడిఎంకెలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి పంపిన ఆహ్వానాన్ని దినకరన్ గ్రూప్ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. దినకరన్ విధేయుల్లో ఒకరైన తంగతమిళ్ సెల్వన్ మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

09/05/2017 - 02:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: విద్యను అభ్యసించాల్సిన చిన్నారులతో పాఠశాలల్లో పాచిపనులు చేయంచడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ‘ఇక్కడికొచ్చే పిల్లలు చదువుకోవడానికేనా, వీళ్లను విద్యార్థులనే అందామా? ఇలాగే బోధిస్తున్నారా?’ అంటూ ఢీల్లీలోని కొన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు హైకోర్టు చీవాట్లు పెట్టింది.

09/05/2017 - 02:16

బెంగళూరు, సెప్టెంబర్ 4: వివిధ కారణాలతో అమలుకునోచుకోని అలాగే సవరణల దశలోనే ఉన్న 143 చట్టాలను వదిలించుకోవాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఓ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన తరువాత ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టిబి జయచంద్ర సోమవారం వెల్లడించారు.

09/05/2017 - 02:10

గుజరాత్‌లోని ఘేలా సోమ్‌నాథ్ ఆలయంలో పరమ శివునికి అభిషేకం చేస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్

09/04/2017 - 02:19

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ:
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పించన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
కేబినెట్ మంత్రులు
రాజనాథ్ సింగ్ : హోంశాఖ
సుష్మా స్వరాజ్ : విదేశీ వ్యవహారాలు
అరుణ్ జైట్లీ : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్,

09/04/2017 - 02:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కేంద్ర కేబినెట్ మంత్రి ఉమాభారతి, సహాయ మంత్రి విజయ్ గోయల్ ప్రాధాన్యత తగ్గించటం ద్వారా పనిచేయకపోతే మంత్రి పదవులు ఊడతాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినట్లయింది. నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ కేటాయించి సమర్థంగా పనిచేస్తే పదోన్నతితోపాటు ప్రాధాన్యత కూడా లభిస్తుందని చెప్పకనే చెప్పారు.

09/04/2017 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆదివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు బ్యూరోక్రాట్లను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని తన రాజకీయ సహచరులపై నమ్మడం లేదోమోననిపిస్తోందని వ్యాఖ్యానించింది.

Pages