S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/10/2017 - 02:17

శ్రీనగర్, సెప్టెంబర్ 9: అశాంతికి నిలయంగా మారిన జమ్మూ, కాశ్మీర్‌లో శాంతిని పాదుకొల్పి, ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారంనుంచి నాలుగు రోజుల పర్యటనకు శ్రీనగర్ చేరుకున్నారు. ఇదే సమయంలో ఒక పోలీసు బృందంపై మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

09/10/2017 - 02:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన లోక్‌సభ సభ్యురాలు సుశ్మితా దేవ్‌ను జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా స్థానంలో సుశ్మితాదేవ్ నియామకాన్ని ఆమోదించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

09/10/2017 - 01:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: శ్రీలంకతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, విస్తృతం చేసుకోవడానికి ఆ దేశ నాయకత్వంతో కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలో మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపన శనివారం తనను కలుసుకున్నప్పుడు మోదీ ఆయనకు ఈ విషయం తెలియజేశారు.

09/10/2017 - 01:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: శ్రీలంకతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, విస్తృతం చేసుకోవడానికి ఆ దేశ నాయకత్వంతో కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలో మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపన శనివారం తనను కలుసుకున్నప్పుడు మోదీ ఆయనకు ఈ విషయం తెలియజేశారు.

09/10/2017 - 01:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతీ నటరాజన్‌కు చెందిన చెన్నై నివాసంలో సిబిఐ శనివారం సోదాలు నిర్వహించింది. యుపిఏ ప్రభుత్వ హయాంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం 120 బి సెక్షన్ కింద ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సిబిఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

09/10/2017 - 01:00

హైదరాబాద్, సెప్టెంబర్ 9: దాదాపు 30 వస్తువులపై జిఎస్‌టిని తగ్గించామని, కెవిఐసి కేంద్రాల్లో విక్రయించే ఖాదీ దుస్తులపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని పూర్తిగా మినహాయించామని, కార్లపై జిఎస్‌టిలో స్వల్పంగా మార్పులు చేశామని, పన్ను చెల్లించేందుకు రిటర్న్స్ దాఖలు చేసే గడువును పొడిగించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

09/09/2017 - 02:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాకారమవుతుందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. భాగస్వామ్య ప్రజాస్వామ్య నిర్మాణానికి అక్షరాస్యత దోహదపడుందని ఆయన అన్నారు. శుక్రవారం విజ్ఞాన్‌భవన్‌లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్టప్రతి ప్రసంగించారు.

09/09/2017 - 02:28

సిర్సా, సెప్టెంబర్ 8: ఇద్దరు సాధ్వీలపై అత్యాచా రం చేశాడన్న ఆరోపణలపై ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీ మ్ సింగ్ అకృత్యాలు తవ్విన కొద్దీ బైటపడుతున్నా యి.

09/09/2017 - 02:24

పర్బనీ, సెప్టెంబర్ 8: పెద్దనోట్లు రద్దుచేయాలన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోదీకి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రద్దుయిన పెద్దనోట్లన్నీ తిరిగి బ్యాంకుల్లోకి వచ్చేయడంతో ఇది పూర్తిగా విఫలమైందని పేర్కొన్న ఆయన అసలు ‘మోదీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆర్‌బిఐకూ తెలియదు. ప్రధాన ఆర్థికవేత్తకూ తెలియదు.

09/09/2017 - 02:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఉగ్రవాదంతో సతమతమవుతున్న జమ్మూ-కాశ్మీరులో అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు ‘సానుకూల దృక్పథంతో’ వెళ్తున్నానని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Pages