-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
ముంబయి, ఫిబ్రవరి 21: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 227 డివిజన్ల బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి)కు మంగళవారం పోలింగ్ జరిగింది. అనేకమంది ప్రముఖులు ఓటు వేయడానికి ఉదయమే పోలింగ్ స్టేషన్లకు వచ్చారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఆయుష్, ఆయుర్వేద వంటి ప్రత్యామ్నాయ వైద్య చికిత్సా విధానాలను ప్రోత్సహించాల్సిందిగా విదేశాలలో ఉన్న ఇండియన్ మిషన్లను ఆదేశించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ తెలిపారు. ఆయుష్, ఆయుర్వేద వంటి ప్రత్యామ్నాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి తీవ్రంగా కృషి చేయాలని ఇండియన్ మిషన్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఆయన వివరించారు.
బెంగళూరు, ఫిబ్రవరి 21: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్షతో పాటుగా రూ.10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఒకవేళ శశికళ ఆ పది కోట్ల జరిమానా కట్టకుంటే ఏమవుతుందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వారికి లంచాలు ఇవ్వడాన్ని ‘విచారించదగిన నేరం’గా సవరించాలన్న ప్రతిపాదనకు మెజారిటీ రాష్ట్రాలు మద్దతు పలికాయి. ఎన్నికల్లో అవినీతిని ‘విచారించదగిన నేరం’గా సవరిస్తే ధనబలాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం (ఇసి) భావిస్తోంది. ప్రస్తుతం నేర శిక్షాస్మ్మతి (సిఆర్పిసి) ప్రకారం ఓటర్లకు లంచాలు ఇవ్వడం విచారించదగిన నేరం కాదు.
చెన్నై, ఫిబ్రవరి 21: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్పై అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ సెక్రటరీ ఎఎంపి జమాలుద్దీన్కు పార్టీ ఓ లేఖ ఇచ్చింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి ఎకె పళనిస్వామి విశ్వాస ప్రకటన ఓటింగ్ సందర్భంగా స్పీకర్ సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎస్పి, బిఎస్పి ప్రతిపక్ష స్థానంకోసం పోటీపడుతున్నాయని మంగళవారం ఇక్కడ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గుజరాత్ గాడిదలంటూ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. అఖిలేశ్ వాడిన భాష ప్రజల భాష కాదని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21:ఉత్తమ అనువాద గ్రంథానికి సాహిత్య అకాడమీ అందజేసే పురస్కారం ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్కు లభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రపై రామ్మోహన్ గాంధీ ఆంగ్లంలో రాసిన పుస్తకానికి అశోక్ చేసిన తెలుగు అనువాదానికి ఈ బహుమతి దక్కింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: హైదరాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న నిరుద్యోగుల ర్యాలీకి ఢిల్లీ తెలంగాణ జేఏసీ సంఘీభావం తెలిపింది. అధికారంలోకి వస్తే ఏటా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని టీఆర్ఎస్ను ఢిల్లీ టీజేఏసీ ప్రశ్నించింది.
ముంబయి, ఫిబ్రవరి 21: రద్దయిన వెయ్యి నోట్ల స్థానే సరికొత్త మార్పులతో కొత్త నోట్లను జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ సన్నద్ధమవుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొత్త వెయ్యి నోట్ల ముద్రణ మొదలైనట్టుగా తెలుస్తోంది. నిజానికి జనవరిలోనే వీటిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావించినప్పటికీ 500నోట్ల సరఫరా వత్తిడి పెరగడం వల్ల వెయ్యి నోట్ల జారీలో జాప్యం జరిగినట్టుగా చెబుతున్నారు.
ముంబై: మంగళవారం జరుగుతున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో పలువురు సినీ, కార్పొరేట్, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7:30 గంటలకే ఓటింగ్ ప్రారంభమవ్వడంతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరికొద్ది సేపటికే శివసేన చీఫ్ ఉద్దవ్ ధాకరే బంద్రాలోనూ, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే దాదార్లోనూ ఓటేశారు.