S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2016 - 12:05

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగల్ ఆలయంలో ఆదివారం ఉదయం బాణసంచా పోటీల సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి అయిదుగురు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో 108 మంది మరణించగా, 380 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆలయం వద్ద బాణసంచా పోటీలకు అనుమతి లేకున్నా , నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కేరళ సిఎం ఊమెన్ చాందీ తెలిపారు.

04/11/2016 - 12:04

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో రెండో దశ పోలింగ్ సందర్భంగా జుమూరియా ప్రాంతంలో సోమవారం ఉదయం అధికార తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో పలువురు గాయపడ్డారు. హింస చెలరేగడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

04/11/2016 - 12:03

కోల్‌కత: పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీలకు సోమవారం ఉదయం రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. బెంగాల్‌లో రెండోదశ పోలింగ్‌లో 31 స్థానాలకు పోలింగ్ జరుగతుండగా 163 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అస్సాంలో 61 స్థానాలకు 525 మంది రంగంలో నిలిచారు. అస్సాంలో రెండో విడతతో ఎన్నికల ఘట్టం ముగుస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా అస్సాంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

04/11/2016 - 07:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సమైక్య రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడగొడుతూ చట్టం చేశారే కాని తెలుగు భాషను ఎవ్వరూ విభజించలేరని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ 28వ ఉగాది సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారం మాలవంకర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.

04/11/2016 - 08:28

కొల్లాం, ఏప్రిల్ 10: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓ ప్రాచీన ఆలయంలో సంభవించిన పెను విషాదం వేలాదిమందిని కదిలించి వేసింది. క్షణాల ముందువరకూ ఆనందోత్సాహాల మధ్య సాగిన వాతావరణం అంతలోనే భయానక విషాదంగా మారి స్మశాన సదృశమే అయంది. ఒక్కసారిగా సంభవించిన బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం హాహాకారాల మయంగా మారింది. కాలిన మృతదేహాలు, కూలిన ఆలయ స్లాబులతో నిండిపోయంది.

04/11/2016 - 07:21

ముంబయి, ఏప్రిల్ 10: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ భార్య కాటే మిడిల్‌టన్‌తో కలిసి ఆదివారం ఇక్కడికి వచ్చారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన విలియమ్ దంపతులు మధ్యాహ్నం ముంబయిలో అడుగుపెట్టారు. ముంబయిపై ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడిలో మృతిచెందిన వారి స్మారకార్థం ఇక్కడి తాజ్ ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన మెమోరియల్‌ను వారు సందర్శించారు.

04/11/2016 - 07:19

గౌహతి/కోల్‌కతా, ఏప్రిల్ 10: అసోంలో చివరి విడత, పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌ను సోమవారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిగ్గింగ్ తదితర అక్రమాలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అసోంలోని 61 నియోజకవర్గాలలో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ అధికార కాంగ్రెస్, బిజెపి-ఎజిపి-బిపిఎఫ్ కూటమి, ఎఐయుడిఎఫ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

04/11/2016 - 07:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలాన్ని ఇకపై ప్రభుత్వం నిర్ణయించదు. ఈ అంశంపై చాలాకాలంగా చర్చలు జరిపిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీకాలాన్ని ఏడాదిపాటు పరిమితం చేస్తూ సిపార్సు చేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది.

04/11/2016 - 07:17

కొల్లాం, ఏప్రిల్ 10: పుట్టింగల్ ఆలయంలో సంభవించిన ప్రమాదాన్ని ఊహించశక్యం కానిదిగా పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్లిష్టసమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అన్నివిధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన స్థలాన్ని, అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కొల్లాం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు.

04/11/2016 - 05:55

383మందికి తీవ్ర గాయాలు పుట్టింగల్ దేవి ఉత్సవాల్లో పెను విషాదం
అగ్నికీలలు సృష్టించిన బాణసంచా నిప్పురవ్వలు పడి గోడౌన్‌లోనూ విస్ఫోటనాలు
పెనువిపత్తును సృష్టించిన ఆనందం మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్రాల 12లక్షల సాయం

Pages