S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/07/2016 - 17:59

దిల్లీ: విద్యార్థులను హింసించకండి, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలో ఇటీవల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఎలా మెలగాలన్న అంశాన్ని బిజెపి, దాని మిత్రపక్షాలు ఎప్పుడు తెలుసుకుంటాయని ఆయన ప్రశ్నించారు.

04/07/2016 - 15:52

దిల్లీ: దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో దిల్లీ సిఎం కేజ్రీవాల్‌తో పాటు మరో అయిదుగురు ‘ఆప్’ నేతలకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు దిల్లీ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. డిసిఎ అధ్యక్షుడిగా జైట్లీ పలు అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు.

04/07/2016 - 15:29

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. శారీరకంగా, మానిసికంగా రాహుల్ చిత్రహింసలకు గురిచేసినందునే తమ కుమార్తె మరణించిందని ప్రత్యూష తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ప్రత్యూష ముక్కుపై, ముఖంపై దెబ్బలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో రాహుల్‌పైనే పోలీసులు దృష్టి పెట్టారు.

04/07/2016 - 13:20

న్యూ యార్క్: ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన ‘ఆసియాలో అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల’ జాబితాలో మనదేశానికి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తం 50 మంది మహిళలతో ఈ జాబితా విడుదల చేయగా ఇందులో భారత్‌కు చెందిన వారు ఎనిమిదిమంది ఉన్నారు. ఎస్‌బిఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు.

04/07/2016 - 12:52

నైనిటాల్: రాష్టప్రతి పాలనను రద్దు చేసే హక్కు తమకు ఉందని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న కేసుపై సరిగా స్పందించకుంటే పిటిషనర్ హక్కులను కాపాడతామంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

04/07/2016 - 12:50

దిల్లీ: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్యకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరై కారులో తిరిగి దిల్లీ వస్తుండగా బైక్‌పై వెంబడించిన దుండగులు ఆయనను హత్య చేశారు. వారు వాడిన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

04/07/2016 - 12:49

దిల్లీ: తాను బకాయిపడిన మొత్తంలో నాలుగు వేల కోట్ల రూపాయలను త్వరలో చెల్లిస్తానన్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌మాల్యా ప్రతిపాదనకు బ్యాంకులు సమ్మతించలేదు. మాల్యా రుణాల ఎగవేత పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా బ్యాంకులు ఈ విషయాన్ని తెలిపాయి. వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు బకాయిపడిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.

04/07/2016 - 07:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు అద్భుతమైన రీతిలో సేవలందిస్తున్నాయని, కష్టపడి పని చేస్తున్న ముఖ్యమంత్రులను చూసి పార్టీ గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

04/07/2016 - 08:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడుతూ, బంగారు ఆభరణాలపై విధించింది ఒక శాతం ఎక్సైజ్ సుంకం కాదని, అది బంగారం వ్యాపారుల పాలిట యమపాశం వంటిదని అన్నారు. అంతేకాదు బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకే బిజెపి ప్రభుత్వం ఈ పని చేసిందన్నారు.

04/07/2016 - 01:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రైతులకు స్మార్ట్ పంపుసెట్లు, ఇళ్లు, దుకాణాలు సంస్థలకు స్మార్ట్ ఫ్యాన్లు వస్తున్నాయి. కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం విజయవాడలో స్మార్ట్ పంపుసెట్లు, ఫ్యాన్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పియూష్ గోయల్ కార్యాలయం తెలిపింది.

Pages