S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/05/2016 - 03:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో సోమవారం జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు బెంగాల్‌లో 80 శాతం, అసోంలో 70 శాతం ఓటిం గ్ నమోదయిందని డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు.

04/05/2016 - 03:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కరించే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించనున్నాయి. గత ఏడాది మార్చి 30 తరువాత ట్రిబ్యునల్ ఇప్పుడు సమవేశమవుతోంది.

04/05/2016 - 02:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పన్నులకు స్వర్గ్ధామమైన పనామాలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా భావిస్తున్న 500 మంది భారతీయులతో కూడిన జాబితాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి కేంద్రీకరించింది. ‘పనామా పేపర్స్’ పేరిట లీకయిన ఈ రహస్య జాబితాలో సినీనటులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు సహా భారత్‌కు చెందిన సుమారు 500 మంది ప్రముఖులున్నారు.

04/05/2016 - 04:11

జమ్మూ, ఏప్రిల్ 4: సుదీర్ఘ తర్జన భర్జనలు, మంతనాల నేపథ్యంలో ఎట్టకేలకు జమ్మూకాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. 56 ఏళ్ల మెహబూబా చేత గవర్నర్ ఎన్‌ఎన్ వోరా ప్రమాణం చేయించారు. తన తండ్రి హయాంలో మాదిరిగానే బిజెపితో కలిసి 22 మంది మంత్రులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమె ఏర్పాటు చేశారు.

04/05/2016 - 02:40

పనామా సిటీ, ఏప్రిల్ 4: ప్రపంచ వ్యాప్తంగా వివిధ మీడియా సంస్థలు ప్రచురిస్తున్న ‘పనామా పేపర్స్’ నల్లధనం కుంభకోణానికి కేంద్రంగా లా ఫర్మ్ మొసాక్ ఫొనె్సకా నిలిచింది.

04/05/2016 - 02:39

చెన్నై, ఏప్రిల్ 4: తమిళనాడులో తన రాజకీయ ప్రత్యర్థి డిఎంకెను ఈ ఎన్నికల్లోనూ మట్టికరిపించడానికి అన్నాడిఎంకె పావులు కదుపుతోంది. పలు సంస్థల సర్వేల పలితాలూ అనుకూలంగా రావడంతో అన్నాడిఎంకె ఉత్సాహంతో ముందుకెళుతోంది. మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 227 మంది అభ్యర్థులతో జాబితాను ముఖ్యమంత్రి జయలలిత సోమవారం వెల్లడించారు. జయలలిత ఆర్‌కె నగర్ నియోజకవర్గం నుంచే ఈసారీ పోటీ చేయనున్నారు.

04/05/2016 - 02:38

పిల్‌భిత్, ఏప్రిల్ 4: ఉత్తరప్రదేశ్‌లోలి పిల్‌భిత్‌లో 1991లో జరిగిన పది మంది సిక్కు యాత్రికుల బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులుగా భావిస్తున్న 47 మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

04/05/2016 - 02:57

గోల్‌పార, ఏప్రిల్ 4: అసోంలో రెండు, ఆఖరి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటర్లపై వరాలు కురిపించారు. రాష్ట్రంలో ‘మేక్ ఇన్ అసోం’ కింద పది లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని సోమవారం ఆయన ప్రకటించారు. ‘అభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్... పేదల ఉద్ధరణకు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారు.

04/05/2016 - 02:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టివి నటి ‘బాలిక వధు’ ప్రత్యూష బెనర్జీ గత రెండు నెలల్లో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె ఆప్తమిత్రురాలు, టివి నటి సరాఖాన్ తెలిపిందని ఒక వార్తా సంస్థ వెల్లడించింది. ప్రత్యూష ఆత్మహత్య తర్వాత ఆమె గురించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మిత్రులు, బంధువులు ఆమె వ్యక్తిగత జీవిత విషయాలను బయటపెడుతున్నారు.

04/05/2016 - 02:55

రోహ్‌తక్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: యోగా గురువు రామ్‌దేవ్ బాబా సోమవారం ఇక్కడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘్భరత్ మాతాకీ జై’ అనకపోతే లక్షలాది మంది తలలు నరికి చంపేసేవాడినని ఆయన అన్నారు. అయితే భారత రాజ్యాంగలో ‘్భరత్ మాతాకీ జై’ అనాలని ఎక్కడా లేదు కాబట్టి దానిపై గౌరవంతో తాను ఆ పనిచేయడం లేదని రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాతృదేశాన్ని గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Pages