ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మాయం
Published Wednesday, 26 October 2016భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పసికందు మాయమైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు మాయమైన శిశువును తీసుకెళ్లి ఉండవచ్చనే సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రుల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు అనుమానితురాలిగా ఉన్న ఒక మహిళను గుర్తించారు. పసికందు మాయం ఘటనలో నిందితురాలి ఆనవాళ్లు రాబట్టిన పోలీసులు స్థానికంగా ఉన్న ఒక చిన్నపిల్లల ఆసుపత్రిలో కిడ్నాప్ చేసిన మహిళ పసికందుతో ఉన్న ఫుటేజీని కనుగొన్నారు. సీసీ కెమెరా పుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి కిడ్నాప్ చేసిన మహిళ ఆమె అని నిర్ధారించుకున్నారు.