సవాలుకు సై
Published Sunday, 25 September 2016కోజికోడ్, సెప్టెంబర్ 24: ‘మీ సవాలును నేను స్వీకరిస్తున్నా. పాకిస్తాన్తో యుద్ధం చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పోరాట పటిమే ఉంటే పేదరికంపైనా, నిరుద్యోగంపైనా, నిరక్షరాస్యతపైనా ఎందుకు పోరాటం చేయరు? ఆ పోరాటంలో భారత్, పాకిస్తాన్లలో ఎవరు గెలుస్తారో చూద్దాం’... భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్కు సూటిగా చెప్పిన మాటలివి. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగదాడి చేసి 18మంది సైనికులను బలి తీసుకున్న తరువాత ప్రధాని మోదీ మొట్టమొదటిసారి పాకిస్తాన్కు తీవ్రస్థాయిలో హెచ్చరిక చేశారు.