బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్నా
Published Sunday, 25 September 2016మిస్టర్ కూల్ అని అందరిచేత ముద్దుగా పిలిపించేకునే టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హైదరాబాద్లో హంగామా చేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎంఎస్ ధోని’ (ద అన్టోల్డ్ స్టోరీ). చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధోని రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడి బిర్యానీ గుర్తుకు వస్తుందని, తొలిసారిగా ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు బిర్యానీ రుచి చూశానని తెలిపారు.