రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Friday, 23 September 2016కృష్ణగిరి, సెప్టెంబర్ 22: మండల పరిదిలోని అలంకొండ గ్రామానికి చెందిన పుండుకూర లవన్న (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం లవన్న తన గ్రామం నుండి స్వంత పని మీద ఆటోలో డోన్కు బయలు దేరాడు. కటారుకొండ గ్రామం దాటిన తర్వాత ఆటో డ్రైవరు సడన్గా బ్రేక్ వేయడంతో లవన్న ఆటో నుంచి జారీ కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన లవన్నను ఆదే ఆటోలో చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలసి ఎస్సై సోమ్లానాయక్ ప్రభుత్వా ఆసుపత్రికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు.