జ్వర బాధితులకు తాత్కాలికంగా నాలుగు అదనపు వార్డులు
Published Tuesday, 20 September 2016అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో 350 రోగులకు సరిపడా వైద్యసేవలందించే డాక్టర్లు, సిబ్బంది, వౌలిక వసతులు వున్నాయని అయితే వైరల్ ఫీవర్స్ భయంతో 3 రెట్లు అధికంగా (1006) రోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం నాటికి ఇన్పేషెంట్స్గా వున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జ్వర బాధితుల కోసం మరో నాలుగు అదనపు వార్డులను ఏర్పాటుచేయడానికి సూపరింటెండెంట్ ఛాంబర్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అదనపు వార్డ్ల ఏర్పాటుతో అధికంగా వస్తున్న విష జ్వరాల బాధితులకు వైద్యం అందిస్తామన్నారు.