పుష్కరాలకు 17,500 పోలీసులతో బందోబస్తు
Published Friday, 5 August 2016విజయవాడ: కృష్ణా పుష్కరాలకు అత్యాధునిక సాంకేతికతతో భద్రత, నిఘా ఏర్పాటు చేస్తున్నామని, 17,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం తెలిపారు. 19 మంది ఐపీఎస్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారని, 1300 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని , మరిన్ని బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.