ఎట్టకేలకు భీమేశ్వరాలయ ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకారం
Published Friday, 5 August 2016సామర్లకోట, ఆగస్టు 4: సాక్షాత్తూ భీమేశ్వరుని యోగలింగం సాక్షిగా ఎట్టకేలకు సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయానికి పాలక మండలి ట్రస్టుబోర్డు ఏర్పాటయింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో గురువారం ఉదయం ఆలయంలోని స్వామివారి అంతరాలయం ఎదురుగా నియమితులైన పదిమంది సభ్యులతో ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.