S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవిశ్రీ టీవీ షో

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వరుస సినిమాల విజయంతో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూన్న దేవి మరోవైపు, తమిళంలో కూడా తన సత్తా చాటుకున్నాడు. డిఎస్‌పిగా పాపలరైన దేవిశ్రీ, మొట్టమొదటసారి టెలివిజన్ తెరపై షో ఇవ్వడం విశేషం. డిఎస్‌పి యుఎస్‌ఎ వరల్డ్ ప్రిమియర్ ఈవెంట్ పేరుతో అమెరికాలో సందడి చేసిన ఈ షోను త్వరలోనే జీ టీవీలో ప్రసారం చేయనున్నారు.
మహేష్ యాక్షన్

శేఖర్ కమ్ముల ఫిదా

తెలుగు తెరపై దర్శకుడిగా తనదైన గుర్తింపు దక్కించుకున్న శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘్ఫదా’. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా మలయాళ ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.

మరో చిన్న సినిమాతో సుకుమార్

దర్శకుడిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్, ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా చిన్న సినిమాలని నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం సంచలన విజయం సాధించింది. దాంతో మరింత ఊపుతో ఆయన మరిన్ని చిత్రాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ నిర్మించే ఈ బ్యానర్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. నాగశౌర్య హీరోగా నటిస్తాడని, ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.

బాబు బంగారం సెన్సార్ పూర్తి

ప్రముఖ నటుడు వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబుబంగారం చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్‌బోర్డు నుండి యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. గోపాల.. గోపాల సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఈనెల 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

హాలీవుడ్ ఛాన్స్

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో హీరోగా ప్రవేశించి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అరవింద్‌స్వామి. ఆ తరువాత బొంబాయి సినిమాతో బాలీవుడ్‌లోనూ పాపులరైన అరవింద్‌స్వామి ఆ తరువాత వరుస సినిమాల పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత కడలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయనకు తనిఒరువన్ మంచి బ్రేక్‌నిచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ విలన్‌గా ప్రారంభించిన అరవింద్‌స్వామికి ఆ సినిమాతో అటు బాలీవుడ్‌నుండి ఇటు టలీవుడ్ వరకూ అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తనిఒరువన్ రీమేక్ ధ్రువ చిత్రంలో అదే పాత్రను పోషిస్తున్నాడు.

కిశోర్ తిరుమలతో వెంకీ చిత్రం

విభిన్న కథా చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్, ప్రస్తుతం ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ‘నేను శైలజ’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని పిఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రాంమోహన్‌రావు నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 28న బాహుబలి-2

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ చిత్రం అంతే భారీ వసూళ్లను దక్కించుకుంది. రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ రూపొందుతోంది. ది కన్‌క్లూజన్ పేరుతో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారట. నిజానికి ఏప్రిల్ 14నే విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని పరిస్థితులవల్ల విడుదల తేదీ మారిందట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహార్ తెలిపారు.

సన్నీ అంటే ఇష్టమంట!

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌కు కనీసం ఒక్క బ్రేక్ అయినా రాలేదు. అవకాశాలు మాత్రం వచ్చాయి కానీ, అనుకున్న క్రేజ్ దక్కలేదు. దాంతో అందాల ఆరబోతలో శ్రుతిమించిన శ్రద్ధాదాస్ ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగులేసింది. అక్కడ అడల్డ్ కంటెంట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ ఈమెకు మంచి గుర్తింపే వచ్చింది. తాజాగా ఓ మ్యాగజిన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులివ్వడమే కాకుండా ఓ ఇంటర్వ్యూకూడా ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బెరకు లేకుండా సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నో చిలిపి విషయాలు చెప్పిన ఈమెకు సన్నిలియోన్ అంటే బాగా ఇష్టమని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

బన్నీతో మరోసారి

మలయాళ భామ కేథరీన్ ఈమధ్య తమిళంతోపాటు తెలుగులోనూ జోరుమీదుంది. లేటెస్టుగా సరైనోడు సక్సెస్‌తో ఫామ్‌లోకి వచ్చిన ఈమె, ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సరసన నటించేందుకు రెడీ అయ్యింది. ఇదివరకే బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించింది. సరైనోడు తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం కల్పించారని అంటున్నారు. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ ఎయిట్ ప్యాక్‌లో కన్పిస్తాడని సమాచారం.

సెన్సార్‌లో నువ్వు ఎవరో..

సుమన్‌శెట్టి, చిత్రం శ్రీను, చిట్టిబాబు, శిల్ప, మేఘనారాయ్ ముఖ్యపాత్రల్లో విఎకె భాస్కర్ దర్శకత్వంలో దేవికృష్ణ సినిమా పతాకంపై షాబోలి రమాగౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైన సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించామని, దర్శకుడు భాస్కర్ చక్కగా రూపొందించాడని, షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయన్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని, త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహిస్తామన్నారు.

Pages